తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో, డిస్కంలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులందరినీ దశల వారీగా క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకా శాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చం ద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలు తక్షణమే సమ్మె పిలుపును ఉపసంహరించుకుని శుక్ర వారం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డితో చర్చల కు రావాలని పిలుపుని చ్చారు. విద్యుత్ ఉద్యోగుల సమ స్యలపట్ల ప్రభుత్వం తొలి నుంచీ సానుకూ లంగా స్పందిస్తోందని, ఏ సమస్య ఉన్నా చర్చల ద్వారా పరిష్కరించు కునే అవకాశముందని, సమ్మెలు అవసరం లేద న్నారు. రాజకీయ కారణాలతో చేసే సమ్మెలో భాగస్వాములు కారాదని సూచిం చారు.
Dec 2 2016 7:53 AM | Updated on Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement