'బాస్' చంద్రబాబే: ఛార్జ్షీటులో ఏసీబీ | Claims `Boss' is andhra pradesh chief minister chandrababu niadu,cites Phone Call Recordings | Sakshi
Sakshi News home page

Jul 29 2015 11:47 AM | Updated on Mar 21 2024 7:54 PM

సంచలనం సృష్టించిన 'నోటుకు కోట్లు' కేసుకు సంబంధించిన ఛార్జ్షీటులో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చేర్చినట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఓ కథనం ప్రచురించింది. 'క్లైయిమ్స్ బాస్ ఈజ్ ఏపీ సీఎం' అంటూ ఆ పత్రిక మొదటి పేజీలో వార్తను వేసింది. ఓటుకు కోట్లు కేసు ఛార్జ్షీటులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చినట్లు ఏసీబీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.సురేందర్ రావు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.ఐదు కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలిస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. సెబాస్టియన్ ఫోన్ నుంచి చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సంభాషణతోపాటు చంద్రబాబు ఆదేశాల మేరకే తాను మాట్లాడేందుకు వచ్చానంటూ రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన సంభాషణల ఆధారంగా బాబు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచినట్లు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement