'గొంతు నీదని ఒప్పుకో.. కాదంటే విచారణకు సిద్ధంకా' | Chandrababu should ready to face enquiry about Cash For Vote: Suravaram Sudhakar Reddy | Sakshi
Sakshi News home page

Jul 9 2015 7:28 PM | Updated on Mar 20 2024 1:43 PM

ఓటుకు కోట్లు వ్యవహారానికి సంబంధించి టేప్ లో ఉన్న గొంతు తనదో కాదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. లేదంటే విచారణకు సిద్ధమవ్వాలని సవాలు విసిరారు. చంద్రబాబు తీరు ప్రజలను తప్పు దోవపట్టించేలా ఉందని అన్నారు. ఇప్పుడు సెక్షన్ 8ని అమలు చేయాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. మరోపక్క, వ్యాపం కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించడం మంచి పరిణామం అని సురవరం అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement