డీజీపీ ఆఫీసులో లొంగిపోయిన అవినాష్ | avinash-surrender-ap-dgp-office-in-hyderabad | Sakshi
Sakshi News home page

Mar 12 2015 4:11 PM | Updated on Mar 21 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి ఎన్. చినరాజప్ప బంధువునంటూ పలువురిని మోసం చేసిన అవినాష్ ఎట్టికేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గురువారం హైదరాబాద్లో ఏపీ డీజీపీ కార్యాలయానికి వచ్చిన అవినాష్ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయాడు. ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడి, చిత్రహింసలకు గురి చేసిన పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్రపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. అందులోభాగంగా అవినాష్ను పట్టుకునేందుకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం అవినాష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అలాగే అవినాష్ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. అవినాష్ దురాగతాలపై ఏప్రిల్ 6 నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement