జన్లోక్పాల్ బిల్లుకోసం వెయ్యిసార్లైనా సీఎం పదవిని వదిలేస్తా అన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నంత పని చేశారు. జన లోక్ పాల్ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించకపోవడంతో కేజ్రివాల్ రాజీనామా సమర్పించారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపారు. దాంతో కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వ పాలన 49 రోజులకే ముగిసింది. కాంగ్రెస్ మద్దతుతో కొనసాగిన ప్రభుత్వం దినదిన గండంగానే గడిచింది. ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో చాలా వేగంగా కేజ్రివాల్ రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు.
Feb 14 2014 9:14 PM | Updated on Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement