విశాఖ బీచ్ లో ముగ్గురి గల్లంతు | Sakshi
Sakshi News home page

విశాఖ బీచ్ లో ముగ్గురి గల్లంతు

Published Thu, May 28 2015 4:23 PM

విశాఖజిల్లాలోని తెన్నేటిపార్కు సమీపంలోని జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానం చేస్తున్న ముగ్గుర్ని ఒక్కసారిగా వచ్చిన రాకాసి అల మింగేసింది. ఈ ఘటనలో లోకేష్(19), రాజు(18), విజయ్(20) అనే ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో సుమారు పది మంది స్నేహితులు ఆ తీరంలో ఉన్నారు. అందులో ముగ్గురు స్నానానికి దిగారు. ఒక్కసారిగా వచ్చిన అల ముగ్గురిని సముద్రంలోకి లాక్కెళ్లింది.