మదనపల్లె టౌన్ : మదనపల్లె యువకుడు తిరుపతిలో మృతి చెందినట్లు అక్కడి ఈస్ట్ పోలీసులు మదనపల్లె వన్ టౌన్ పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రహీముల్లా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి పట్టణం ఎస్వీ మెడికల్ కాలేజీ–రుయా రోడ్డులోని ఫుట్ పాత్పై మదనపల్లె యువకుడు మృతి చెంది ఉండటాన్ని ఈస్ట్ పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్, పాన్ కార్డులో మృతుడు మదనపల్లె మండలం పొన్నూటి పాళ్యం కుమారపురం నమాజు కట్ట ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుమారుడు ఎం.ప్రేమ్కుమార్(30)గా గుర్తించారు. వారు వెంటనే మదనపల్లె పోలీసులకు సమాచారం అందించారు. సంబంధీకులు మృతదేహాన్ని గుర్తించి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు.


