
గంగమ్మా..కరుణించమ్మా
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే అనంతపురం గంగమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గంగమ్మా కరుణించి.. కాపాడవమ్మా.. సకాలంలో వర్షాలు కురిపించు తల్లీ అంటూ భక్తులు వేడుకున్నారు.కొందరు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని క ల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో కూంబింగ్
సిద్దవటం: సిద్దవటం రేంజిలోని గొల్లపల్లె బీటులో కూబింగ్ నిర్వహించామని సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు. కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ ఆదేశాల మేరకు సిద్దవటం ఫారెస్టు రేంజి పరిధిలోని గొల్లపల్లె, ఫారెస్ట్ బీట్లలోని సమస్యాత్మక , అనుమానిత ప్రదేశాల్లో తమ సిబ్బంది ఆదివారం ఎర్రచందనం అక్రమాలు జరగకుండా కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అటవీ ప్రాంతాల్లోని సమీప గ్రామాల్లో ప్రజలకు ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఓబులేసు, ఫారెస్టుబీట్ అఫీసర్లు ఆది విశ్వనాథ్, మధు పాల్గొన్నారు.