
భూమిలేకపోయినా ఉందని చూపి..
మాది పేద కుటుంబం. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నాకు ఇద్దరు కుమార్తెలు. ఒకరిది 8, మరొకది 10వ తరగతి పూర్తయింది. ఇద్దరికి తల్లికి వందనం పేరుతో రూ.30వేలు వస్తాయనుకున్నాం.అయితే నా పేరిట,తన భర్త సుంకేసుల పెద్ద రెడ్డయ్య పేరిట సెంటు భూమి లేకపోయినా 13 ఎకరాలు ఉందని చూపి డబ్బులకు ఎగనామం పెట్టారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద నగదు అందింది. వాస్తవ అర్హతలు పరిశీలించి డబ్బులు అందేలా చూడాలి. – సుంకేసుల ఇమాంబీ, లింగారెడ్డిపల్లి, చింతకొమ్మదిన్నె మండలం