అప్పుల పండుగ
కనుమ ఉత్సవానికి ఏర్పాట్లు
ద్వారకాతిరుమల చినవెంకన్న కనుమ ఉత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈనెల 16న ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. IIలో u
అవస్థలే నిండుగా..
● జాడలేని సంక్షేమం ● నిర్మాణ రంగం కుదేలు
● డబ్బుల్లేక జనం విలవిల
● సంక్రాంతి కోసం అధిక వడ్డీలకు అప్పులు
● గ్రామాలకు క్యూ కడుతున్న ఫైనాన్స్ వ్యాపారులు
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026
అత్తిలి మండలంలోని బల్లిపాడు గ్రామానికి గతంలో వారంలో బుధ, శనివారాల్లో ఆరుగురు వరకు ఫైనాన్స్ వ్యాపారులు వచ్చేవారు. వీక్లీ, మంథ్లీ పేమెంట్లు చేసేలా అవసరమైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు అప్పులు ఇచ్చేవారు. ఏడాది కాలంలో గ్రామానికి వచ్చే వ్యాపారులు 20 మందికి పైగా పెరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో రెండు రోజులు మాత్రమే వస్తే ప్రస్తుతం వారం పొడవునా వచ్చి అప్పులు ఇస్తున్నారంటున్నారు. ఫైనాన్స్ వ్యాపారం బాగుందన్న ఉద్దేశంతో స్థానికంగాను కొందరు యువకులు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు.
సాక్షి, భీమవరం: గోదావరి జిల్లాల్లో జరిగే అతిపెద్ద పండుగ సంక్రాంతి. విద్య, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడ ఉంటూ స్వస్థలాలకు వచ్చిన వారితో సందడిగా ఉంటుంది. కొత్త దుస్తులు, పిండి వంటలు, జాతరలు, విహారయాత్రలు, ఇంటికి వచ్చే అల్లుళ్లు, మనవళ్లకు కానుకలు రూపంలో పండగ ఖర్చు ఎక్కువే. అయినా లెక్కచేయకుండా ఏడాదికో పండుగ అన్నట్టుగా ఆనందంగా జరుపుకుంటారు.
సంక్రాంతులు కరువు : సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మొదటి ఏడాది సంక్షేమాన్ని విస్మరించింది. 2025లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సబ్సిడీ, మత్య్సకార భృతి, వాహనసేవ పథకాల ద్వారా జిల్లావాసులకు జమచేసింది కేవలం రూ.409 కోట్లు మాత్రమే. మరోపక్క విద్యుత్ చార్జీలు, ఇంటి పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. అభివృద్ధి పనులు నిలిచిపోవడం, రియల్ ఎస్టేట్ రంగం కుదేలై కార్మికులకు సరిగా పనులు ఉండటం లేదు. విపత్తులు, దళారీల దోపిడీతో తొలకరి పంట నష్టాలనే మిగిల్చింది. ఆయా కారణాలతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది.
అధిక వడ్డీలకు.. సాధారణంగా రూ.10 లక్షలలోపు ఫైనాన్స్ చేసే చాలా మంది వ్యాపారులు పెద్ద వ్యాపారుల నుంచి రూపాయి నుంచి రెండు రూపాయల వడ్డీకి (వడ్డీ అడ్జస్ట్మెంట్) తెచ్చి బయట పద్దుల రూపంలో అధిక వడ్డీలకు అప్పులు ఇస్తుంటారు. కొద్ది వారాలుగా మార్కెట్లో అప్పులు తీసుకుంటున్న వారు పెరుగుతున్నారని వ్యాపారులు అంటున్నారు. సంక్రాంతి సందర్భంగా వారి సంఖ్య మరింత పెరగడంతో తమ వద్ద డబ్బులు చాలక అదనంగా వడ్డీ అడ్జెస్ట్మెంట్పై డబ్బులు తెచ్చి ఇస్తున్నారు. పండుగ గడిస్తే చాలు.. మెల్లగా వాయిదాలు కట్టేసుకోవచ్చన్నట్టుగా అధిక వడ్డీలను లెక్కచేయకుండా అప్పులు తీసుకుంటున్నారు. పండుగల రూపేణా జిల్లాలో రూ.100 కోట్ల వరకు ఫైనాన్స్ వ్యాపారం జరుగుతుందని అంచనా. కొన్నాళ్లుగా సరిగా బేరాలు లేక ఖాళీగా ఉన్న క్లాత్ రెడీమేడ్, జ్యూయలరీ, కిరాణా తదితర షాపులు కొద్దిరోజులుగా అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.


