
తమ్మిలేరులో యువకుడి గల్లంతు
చింతలపూడి: చేపల వేటకు వెళ్లిన యువకుడు గల్లంతైన సంఘటన చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు జలాశయంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడి నగర పంచాయతీ ఛార్లెస్నగర్కు చెందిన గడ్డం శాంతకుమార్(29) స్నేహితులతో కలిసి నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు ప్రాజెక్టుకు చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టడానికి జలాశయం లోనికి దిగిన శాంతకుమార్ ప్రమాదవశాత్తూ జలాశయంలో మునిగిపోయాడు. మిగిలిన స్నేహితులు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. అక్కడే ఉన్న మత్స్యకారులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా ప్రాజెక్టు వద్దకు చేరుకుని మృతదేహం కోసం గాలిస్తున్నారు. స్థానిక ఎస్సై కె.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
టీటీడీకి 12 టన్నుల కూరగాయల వితరణ
నూజివీడు: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన ప్రసాదం ట్రస్టుకు నూజివీడు నుంచి శనివారం 12 టన్నుల కూరగాయలను భక్తులు పంపారు. మండలంలోని దేవరగుంటకు చెందిన నక్కా సత్యనారాయణ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి భక్తులు కూరగాయలను సేకరించి టీటీడీ ప్రత్యేక వాహనంలో తిరుమలకు పంపించారు. అలాగే ద్వారకాతిరుమల ఆలయంలో అన్నదానం నిమిత్తం నాలుగు టన్నుల కూరగాయలను పంపారు.
చిత్రలేఖనంలో విద్యార్థుల ప్రతిభ
యలమంచిలి: మేడపాడు హైస్కూల్ విద్యార్థులు యోగాంధ్ర చిత్రలేఖనం పోటీల్లో జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంవీ సత్యనారాయణ తెలిపారు. శనివారం యనా విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల భీమవరంలో జరిగిన పోటీల్లో మేడపాడు హైస్కూల్ విద్యార్థులు డి.కోటేశ్వరి ప్రథమ, ఎ.శివార్షిణి ద్వితీయ స్థానం సాధించినట్లు ఆయన వివరించారు. వారిద్దరికీ కలెక్టర్ నాగరాణి, డీఈఓ బహుమతులు అందజేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయుడు అడ్డాల శివరామకృష్ణంరాజును అభినందించారు.

తమ్మిలేరులో యువకుడి గల్లంతు