
తాడేపల్లిగూడేనికి ఎయిర్పోర్టు
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్రం నుంచి భూసేకరణకు ఉత్తర్వులు అందాయి. 8లో u
కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలి
కేంద్ర కమిటీకి సీపీఎం వినతి
ఏలూరు (ఆర్ఆర్పేట): కొల్లేరును 3వ కాంటూరుకు కుదించి, వారి ఉపాధిని కాపాడి, అక్కడి ప్రజలను ఆదుకోవాలని కొల్లేరులో మంగళవారం పర్యటించిన సీఈసీకి సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ నాయకులు మాట్లాడుతూ కొల్లేరును 5 నుండి 3వ కాంటూరుకు కుదిస్తామన్న పాలకుల హామీలు అమలు కాలేదని, కొల్లేరులో 46 బెడ్ గ్రామాలు, 74 బెల్ట్ గ్రామాలలో మూడు లక్షల మంది మత్స్యకారులు, దళితులు ఉన్నారన్నారు. 1975–76 సంవత్సరాలలో అప్పటి వెంగళరావు ప్రభుత్వం 146 సొసైటీలు ఏర్పాటు చేసి 7100 ఎకరాలలో చేపల చెరువులు తవ్వించారని అన్నారు. కొల్లేరు ఆపరేషన్ సందర్భంగా వేలాది ఎకరాల్లో చేపల చెరువులను ధ్వంసం చేశారని, అయితే ఆ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కొల్లేరు ప్రజలకు జీవనోపాధి కల్పించాలని కోరారు. కొల్లేరు ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, ప్రస్తుత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, సుప్రీంకోర్టుకు నివేదించాలని కోరారు. కొల్లేరులో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని, అటవీ అధికారుల వేధింపులు, అవినీతి అరికట్టాలని కోరారు. కమిటీని కలిసిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బీ బలరాం, జిల్లా కార్యదర్శి ఏ రవి తదితరులున్నారు.