
రైతులతో సమావేశం
నయీంనగర్: ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూములు సేకరించేందుకు ఆరేపల్లి గ్రామానికి చెందిన రైతులతో బుధవారం ‘కుడా’ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్, పీఓ అజిత్రెడ్డితో కలిసి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి రైతులతో మాట్లాడారు. ‘కుడా’ చైర్మన్ రైతులకు ప్రొజెక్టర్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చే ప్రదేశాలను చూపిస్తూ, వారికి జరిగే అభివృద్ధి గురించి, ల్యాండ్ పూలింగ్ అంశం మీద రైతుల్లో నెలకొన్న భయాలు పూర్తిగా తొలగిపోయేలా వివరించారు. భూములు సేకరించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతులు సానుకూలంగా స్పందించి సమయం కావాలని కోరారు.