వ్యాధులు ప్రబలకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

Jun 14 2025 6:38 AM | Updated on Jun 14 2025 6:38 AM

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: వరంగల్‌ జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సాంబశివరావు, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, జిల్లా పరిషత్‌ సీఈఓ రాంరెడ్డి, మలేరియా అధికారి రజిని, డీబీసీడీఓ పుష్పలత తదితర అధికారులు పాల్గొన్నారు.

గిరిజన గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు

జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడానికి ఈనెల 15 నుంచి 30 ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌(పీఎం జనమన్‌) నిర్వహణపై అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామాల్లో గిరిజనులకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement