
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
న్యూశాయంపేట: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, మలేరియా అధికారి రజిని, డీబీసీడీఓ పుష్పలత పాల్గొన్నారు.
గిరిజన గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు
జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడానికి ఈనెల 15 నుంచి 30 ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జనమన్) నిర్వహణపై అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గిరిజనులు అధికంగా ఉండే గ్రామాలను ఎంపిక చేసి ప్రజలకు ఆధార్కార్డు, కుల ధ్రువీకరణపత్రం, ఆయుష్మాన్ భారత్ కార్డు, రేషన్కార్డు, కిసాన్కార్డులు అందించాలని ఆదేశించారు. అర్హులతో దరఖాస్తులు చేయించాలని కలెక్టర్ సూచించారు.
ఈవీఎం గోదాముల తనిఖీ
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్యార్డులోని జిల్లా వేర్హౌస్ గోదాముల్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలెక్టర్ డాక్టర్ సత్యశారద తనిఖీ చేశారు.
ఇంకుడు గుంతలను నిర్మించాలి
లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఇళ్ల నుంచి వెలువడే నీరు, వర్షపు నీరు, మురుగు నీరు భూగర్భంలో ఇంకే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు.
వీడియో కాన్ఫరెన్స్కు ఏర్పాట్లు చేయాలి
జిల్లాలో ఈ నెల 16న ప్రారంభించనున్న 21 రైతునేస్తం కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్కు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరి గిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద