ప్రీరౖపెమరీలో ఆంగ్ల విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రీరౖపెమరీలో ఆంగ్ల విద్య

Jun 14 2025 6:38 AM | Updated on Jun 14 2025 6:38 AM

ప్రీరౖపెమరీలో ఆంగ్ల విద్య

ప్రీరౖపెమరీలో ఆంగ్ల విద్య

విద్యారణ్యపురి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు మరో అడుగు ముందుకు పడింది. ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య(ఇంగ్లిష్‌ మీడియం)ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్‌ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రవేశాలు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్‌ మీడియం కొనసాగిస్తున్నారు. ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టడంతో విద్యార్థి ఆ పాఠశాలలోనే పూర్తిస్థాయి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 210 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యకు ఈ విద్యాసంవత్సరం 2025–26 నుంచి అనుమతులిస్తూ ఇటీవల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

యూకేజీ మాత్రమే..

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ప్రీప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా.. యూకేజీ విద్యార్థుల పాఠాలకు సిలబస్‌ను కూడా ఎస్‌సీఈఆర్‌టీ సబ్జెక్టు నిపుణులు రూపకల్పన చేసినట్లు సమాచారం. యూకేజీ చిన్నారుల కోసం పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందజేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ప్రీప్రైమరీలో చేరిన చిన్నారుల విద్యాబోధనకు ఒక్కో స్కూల్‌కు ఒక్కో వలంటీర్‌ను, చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు ఒక ఆయాను కూడా నియమిస్తారని తెలుస్తొంది. కాగా.. ఒక్కో స్కూల్‌ ప్రీప్రైమరీలో 30 మంది చిన్నారులకు ప్రవేశాలకు ఉండనుందని సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది.

హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో 29 స్కూళ్లు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని హనుమకొండ జిల్లాలో 16, వరంగల్‌ జిల్లాలో 13 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. ఈమేరకు హైదరాబాద్‌ నుంచే ఎంపిక చేసిన పీఎస్‌ల, యూపీఎస్‌ల జాబితాలను ఆయా జిల్లాల విద్యాశాఖల అధికారులకు పంపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 31 పీఎస్‌లలో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. మిగతా మూడు జిల్లాలు మహబూబాబాద్‌, జనగామ, ములుగు జిల్లాలకు అవకాశం కల్పించలేదు.

12 మంది చేరిక..

హనుమకొండ ములుగు రోడ్డులోని పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని పాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీలో 12 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులు చేర్పించారు. శుక్రవారం వీరికి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాసం చేయంచారు. కార్యకమంలో ఎంఈఓ నెహ్రూనాయక్‌, గొల్లపల్లి పీఎస్‌లో ఇద్దరు, రాంనగర్‌ పీఎస్‌లో ఇద్దరు చిన్నారులు ప్రీప్రైమరీ విద్యలో ప్రవేశాలు పొందారు. వీరికి కూడా టీచర్లు అక్షరాభ్యాసం చేయించారు.

ఈ స్కూళ్లలోనే ప్రీప్రైమరీ..

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో యూకేజీ అడ్మిషన్లు

హనుమకొండ జిల్లాలో 16..

వరంగల్‌ జిల్లాలో 13 పాఠశాలలు

నాలుగేళ్లు నిండిన బాలలకు ప్రవేశాలు

పాలెం ప్రభుత్వ పీఎస్‌లో 12మంది చిన్నారుల చేరిక

ఎస్‌సీఈఆర్‌టీ నిపుణులతో

సిలబస్‌ రూపకల్పన

వరంగల్‌ జిల్లాలో..

ఎంపీపీఎస్‌లు: స్వామిరావుపల్లి, లక్కమారిపల్లి, తొగర్రాయి, రామతీర్థం, లింగాపురం, కొండూరు, కొత్తూరు, బుర్హాపల్లి, పైడిపల్లి, జీపీఎస్‌ శుంభునిపేట. ఎంపీయూపీఎస్‌లు: రేకంపల్లి, లెంకాలపల్లి, గన్నారం.

హనుమకొండ జిల్లాలో

ఎంపీపీఎస్‌లు: పరకాల, ఎంపీపీఎస్‌ సీతారాంపూర్‌, మాణిక్యాపూర్‌, కొప్పూరు, (ఎస్సీ కాలనీ) ముల్క నూరు, ముల్కనూరు, భావుపేట కేశ్వాపూర్‌.

ఎంపీయూపీఎస్‌లు: మైలారం, ప్రగతి సింగారం, రతన్‌గిరి. ప్రభుత్వ పీఎస్‌లు : కాజీపేట, గొల్లపల్లి, పాలెం, రాంనగర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement