నగరాభివృద్ధికి సమష్టి కృషి చేద్దాం.. | - | Sakshi
Sakshi News home page

నగరాభివృద్ధికి సమష్టి కృషి చేద్దాం..

Jun 14 2025 6:38 AM | Updated on Jun 14 2025 6:38 AM

నగరాభివృద్ధికి సమష్టి కృషి చేద్దాం..

నగరాభివృద్ధికి సమష్టి కృషి చేద్దాం..

వరంగల్‌ అర్బన్‌: నగరాభివృద్ధికి అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని గ్రేటర్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో ఆమె కమిషనర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది కమిషనర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేశారు. అనంతరం జరిగిన పరిచయ కార్యక్రమంలో కమిషనర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని, కరీంనగర్‌లో మున్సిపల్‌ కమిషనర్‌గా కరీంనగర్‌ కార్పొరేషన్‌లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. మున్సిపల్‌ సర్వీసులపై అవగాహన ఉందని స్పష్టం చేశారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి నగర పరిశుభ్రతకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యం, భవన నిర్మాణ అనుమతులకు జారీ చేసే విధానం, శానిటేషన్‌ విభాగంలో విధులు నిర్వహించే సిబ్బంది సంఖ్య, చెత్త తరలింపు వాహనాలకు జీపీఎస్‌ ఏర్పాటు, తదితర అంశాలను విభాగాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కమిషనర్‌ను డిప్యూటీ కమిషనర్లు ప్రసూనారాణి, రవీందర్‌, (అడ్మిన్‌)రాజేశ్వర్‌, సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌, సిటీ ప్లానర్లు శ్రీనివాస్‌ రవీందర్‌ రాడేకర్‌, పీఆర్‌ఓ ఆయుబ్‌ అలీ డిప్యూటీ కమిషనర్లు రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

అధికారులకు పిలుపునిచ్చిన కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

ఉద్యోగ బాద్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement