ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Jun 21 2025 2:52 AM | Updated on Jun 21 2025 2:52 AM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

అమరచింత/ఆత్మకూర్‌: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందని.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి శుక్రవారం అమరచింత, ఆత్మకూర్‌ మండలాలకు రావడంతో ఘనంగా స్వాగతం పలికారు. మొదట అమరచింతలో పోలీసులు గౌరవ వందనం సమర్పించగా.. స్థానిక కాంగ్రెస్‌ నాయకులు పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి సత్కరించారు. అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అలాగే ఆత్మకూర్‌లో అంబేడ్కర్‌, మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. గాంధీచౌక్‌ నుంచి ఫంక్షన్‌హాల్‌ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు, ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల నెత్తిన అప్పులు మోపిందే తప్ప పేదల సొంతింటి కలను అణిచివేసి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో కాలయాప చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్నివర్గాలకు సమన్యాయం చేస్తున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న 16 రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదో ప్రజలు గమనించాలన్నారు. నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. ఇందుకోసం రూ.175 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఆత్మకూర్‌ రెవెన్యూ డివిజన్‌ ప్రకటించుకుంటామని వెల్లడించారు. పరమేశ్వరస్వామి చెరువు అభివృద్ధి, రూ.22 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రి భవనం, డయాలసిస్‌ కేంద్రం, జూరాల వంతెన, రూ.60 కోట్లతో పట్టణాభివృద్ధి చేపడుతామన్నారు. రాజావళి దర్గాలో మంత్రి చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎంబీ కర్మేల్‌ చర్చిలో పాస్టర్‌ హ్యాపీపాల్‌తో కలిసి ప్రార్థించారు. మార్కండేయ, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్‌ కేశం నాగరాజుగౌడ్‌, నాయకులు అయ్యూబ్‌ఖాన్‌, అరుణ్‌కుమార్‌, మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు తిరుమల్లేష్‌, మహంకాళి విష్ణు, చుక్కా ఆశిరెడ్డి, సర్వారెడ్డి, హన్మంతునాయక్‌, పోసిరిగారి విష్ణు, శ్యాం, తౌఫిక్‌, ఆత్మకూర్లో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్‌ చాంద్‌పాషా, ఎంపీడీఓ శ్రీపాద్‌, నాయకులు గంగాధర్‌గౌడ్‌, రహ్మతుల్లా, పరమేష్‌, తులసీరాజ్‌, నల్గొండ శ్రీను, గడ్డం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూర్‌ డివిజన్‌ సాధిస్తా

రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement