
సక్రమంగా బియ్యం పంపిణీ
కొత్తకోట రూరల్: జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరగకుండా సజావుగా పంపిణీ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు డీలర్లకు సూచించారు. శుక్రవారం మండలంలోని చర్లపల్లిలో రేషన్ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయడంతో పాటు మార్కెట్ గోదామునకు స్థల పరిశీలన చేశారు. బియ్యం నాణ్యతను స్వయంగా పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో లోపాలు తెలిస్తే డీలర్లు, సంబంధి త శాఖల అధికారులపై చర్యలు తప్పవని హె చ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ శేఖర్రెడి ఉన్నారు.
రూ.30.05 కోట్లు జమ
వనపర్తి: రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్ శుక్రవారం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్లో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని కంప్యూటర్ బటన్ నొక్కి రైతులకు పెట్టుబడి సాయంగా రైతుభరోసా నిధులు విడుదల చేశారు. సకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో అయిదు ఎకరాల భూమి ఉన్న 11,476 మంది రైతుల ఖాతాల్లో రూ.30,05,62,758 జమ చేసినట్లు చెప్పారు. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు, ఇప్పటి వరకు రైతు భరోసా పొందని రైతులు వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు.
2 వేల వ్యవసాయ కనెక్షన్లు బిగిస్తాం
వనపర్తిటౌన్: జిల్లాలో జనవరి నుంచి నేటి వరకు 1,200 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, కమర్షియల్ డైరెక్టర్ సాయిబాబా అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ నెలలో మరో 2 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు 25 కేవీఏ నియంత్రికలు 180, 75 కిలో మీటర్ల కండక్టర్ వైరు జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. 9,997 విద్యుత్ స్తంభాలను, 470 నియంత్రికలను, 254 కిలోమీటర్ల కండక్టర్ వైరు ఇచ్చినట్లు పేర్కొన్నారు. చీఫ్ ఇంజినీర్ ఆనంద్, హైదరాబాద్ ఆపరేషన్ రూరల్ జోన్ బాలస్వామి, ఎస్ఈ రాజశేఖరం, వనపర్తి ఆపరేషన్ డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్, టెక్నికల్ డివిజనల్ ఇంజినీర్ వెంకటశివరాం, డివిజనల్ ఇంజినీర్ ఆనంద్బాబు తదితరులు పాల్గొన్నారు.