
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
వనపర్తి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసగృహంలో వనపర్తి మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. పార్టీపై విధేయత, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపే నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, నాయకులు భానుప్రకాశ్రావు, రవిప్రకాశ్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, మతీన్, మాధవరెడ్డి, శివన్న, ధర్మా నాయక్, లక్ష్మీకాంత్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, అశో క్, చిట్యాల రాము తదితరులు ఉన్నారు.