అరసాడలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ | - | Sakshi
Sakshi News home page

అరసాడలో బయోగ్యాస్‌ ప్లాంట్‌

Nov 11 2025 6:11 AM | Updated on Nov 11 2025 6:11 AM

అరసాడలో బయోగ్యాస్‌ ప్లాంట్‌

అరసాడలో బయోగ్యాస్‌ ప్లాంట్‌

అరసాడలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ● కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి వెల్లడి

వంగర: మండలంలోని అరసాడ గ్రామ సమీపంలో రూ.102 కోట్లతో బయోగ్యాస్‌ ప్లాంట్‌ నిర్మిస్తామని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. ప్లాంటు ఏర్పాటు చేయనున్న స్థలాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరుల తో మాట్లాడారు. పీవీఎస్‌ గ్రూపు ఆధ్వర్యంలో ప్లాంట్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ నెల 11న కనిగిరి నుంచి వర్చువల్‌ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారన్నారు. రాజాంలో జరగనున్న వర్చువల్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. రోజుకు 20 టన్నుల బయోగ్యాస్‌ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఈ ప్రాజెక్టు వల్ల 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయ న్నారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ లక్ష్మణరావు, ఆర్డీఓ సత్యవాణి, తహసీల్దార్‌ పిన్నింటి రామారావు, పీవీఎస్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement