స్విమ్మింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారుల పయనం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–17 స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు ఆదివారం పయనమయ్యారు. ఈనెల 3, 4 తేదీల్లో పల్నాడు జిల్లా నరసారావుపేటలో జరగనున్న పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు పలు సూచనలు చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా నుంచి పాల్గొనే స్విమ్మర్లు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని ప్రోత్సహించారు. తద్వారా ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.


