యోగానంద నారసింహుడిగా అప్పన్న | - | Sakshi
Sakshi News home page

యోగానంద నారసింహుడిగా అప్పన్న

Jan 7 2026 7:16 AM | Updated on Jan 7 2026 7:16 AM

యోగానంద నారసింహుడిగా అప్పన్న

యోగానంద నారసింహుడిగా అప్పన్న

సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు మంగళవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి యోగానంద నారసింహుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని యోగానంద నారసింహుడిగా ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల సమేతంగా స్వామిని ఒక పల్లకీలో, ఆళ్వారులను వేరొక పల్లకీలో అధిష్టింపజేశారు. సాయంత్రం ఆలయ మాడవీధిలో స్వామికి వైభవంగా తిరువీధి నిర్వహించారు. ఈ తిరువీధిలో భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement