ఏడు దేశాల నిపుణులకు క్యాన్సర్‌ చికిత్సలో శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఏడు దేశాల నిపుణులకు క్యాన్సర్‌ చికిత్సలో శిక్షణ

Jan 6 2026 8:00 AM | Updated on Jan 6 2026 8:00 AM

ఏడు దేశాల నిపుణులకు క్యాన్సర్‌ చికిత్సలో శిక్షణ

ఏడు దేశాల నిపుణులకు క్యాన్సర్‌ చికిత్సలో శిక్షణ

అగనంపూడి : అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్‌ ఆస్పత్రిలో సోమవారం ‘బిమ్‌స్టెక్‌’ దేశాల సమష్టి కృషితో క్యాన్సర్‌ కేర్‌పై ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి 6వ బిమ్‌స్టెక్‌ శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రకటన మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ అంతర్జాతీయ స్థాయి శిక్షణను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డైరెక్టర్‌ ఉమేష్‌ మహంత్‌శెట్టి మాట్లాడుతూ.. భారత్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, శ్రీలంక, థాయిలాండ్‌, భూటాన్‌, నేపాల్‌ దేశాలకు చెందిన 35 మంది వైద్య నిపుణులు ఈ శిక్షణలో పాల్గొంటున్నారని తెలిపారు. క్యాన్సర్‌ నివారణ, ఆధునిక చికిత్సా పద్ధతులపై అన్వేషణలతో పాటు ఏడు దేశాల మధ్య మెరుగైన వైద్య నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ సీఈవో జితేంద్రశర్మ, ఉక్కు డైరెక్టర్‌ ఏ.కె.బాగ్చి మాట్లాడుతూ.. నాణ్యమైన, సమగ్రమైన వైద్య సేవలను తక్కువ ఖర్చుతో బాధితులకు అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి పొరుగు రాష్ట్రాల రోగులకు కూడా ఇక్కడ విశేష సేవలు అందుతున్నాయని గుర్తుచేశారు. ఈ అంతర్జాతీయ శిక్షణలో భాగంగా ఆంకో పాథాలజీ, ఆంకో నర్సింగ్‌, ప్యాలియేటివ్‌ మెడిసిన్‌, ప్రివెంటివ్‌ ఆంకాలజీ, రేడియేషన్‌ ఆంకాలజీ వంటి విభాగాల్లో నాలుగు వారాల పాటు ఇంటెన్సివ్‌ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement