కలుషిత నీటికి చెక్‌ | - | Sakshi
Sakshi News home page

కలుషిత నీటికి చెక్‌

Jan 2 2026 12:30 PM | Updated on Jan 2 2026 12:30 PM

కలుషిత నీటికి చెక్‌

కలుషిత నీటికి చెక్‌

● అందుబాటులోకి సంచార ప్రయోగశాల ● మొబైల్‌ వాటర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను

ప్రారంభించిన జీవీఎంసీ కమిషనర్‌

డాబాగార్డెన్స్‌: ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్రంలోనే తొలిసారిగా నగరంలో మొబైల్‌ నీటి పరీక్ష ప్రయోగశాలను ప్రారంభించినట్లు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు. వాటర్‌ సప్లై కంపెనీ(విస్కో) రూ.40 లక్షల సీఎస్సార్‌ నిధులతో ఈ మొబైల్‌ ల్యాబ్‌ను సమకూర్చింది. ప్రజలకు నిరంతరాయంగా సేవలందించేందుకు గానూ డీఎంహెచ్‌వో, జీవీఎంసీ తాగునీటి విభాగానికి దీని నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఈ వాహనాన్ని జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్‌ సత్యనారాయణరాజుతో కలిసి కమిషనర్‌ తన బంగ్లా వద్ద గురువారం ప్రారంభించారు. అనంతరం వాహనంలోని నీటి నాణ్యత పరీక్ష పరికరాలను, ప్రయోగశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. నగర ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా మొబైల్‌ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ వాహనంలో శిక్షణ పొందిన ప్రొఫెషనల్‌ కెమిస్టులు అందుబాటులో ఉంటారని, వీరు అత్యాధునిక పరికరాల ద్వారా నీటి నాణ్యతను శాసీ్త్రయంగా విశ్లేషిస్తారని వివరించారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు ఈ వాహనం వెళ్తుందని, ప్రజలు తాము తాగే నీరు ఎంత వరకు సురక్షితమో అక్కడికక్కడే తెలుసుకోవచ్చని అన్నారు. సుమారు రూ.40 లక్షల వ్యయంతో తయారుచేసిన ఈ వాహనంలో స్పెక్ట్రోఫొటోమీటర్‌, టర్బిడిటీ మీటర్‌, డిజిటల్‌ టైట్రేటర్‌ వంటి 7 రకాల అధునాతన పరికరాలు ఉన్నాయని తెలిపారు. జీవీఎంసీ వాటర్‌ సప్లై విభాగం ఆధ్వర్యంలో ఈ వాహనం ప్రతి వార్డులో పర్యటించేలా ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్లు పల్లంరాజు, ఏడుకొండలు, కార్యనిర్వాహక ఇంజినీర్లు మురళీకృష్ణ, శ్రీనివాస్‌, ఇతర జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement