నాట్యరంగంలో నాకో పేజీ ఉండాలి
చదువుతో పాటు సంప్రదాయ నృత్యంపై నాకు, నా తల్లిదండ్రులకు ఎంతో మక్కువ. ఈ క్రమంలో శ్రీనిర్మల నృత్య నికేతన్లో మా గురువు విజయజ్యోతి వద్ద తర్ఫీదు పొందుతున్నాను. నాలుగేళ్ల కాలంలోనే కూచిపూడి నృత్యంలో దేశంలోని పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల వద్ద ప్రత్యేక రోజుల్లో ప్రదర్శనలు ఇచ్చాను. జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ నెల 3న కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కోటి దీపోత్సవంలో ప్రదర్శన ఇవ్వడానికి మా గురువు, బృందంతో వెళుతున్నాను. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నదే నా ఆశయం.
– శార్వాణిదేవి, ఏయూ ఎంఏ(డ్యాన్స్) విద్యార్థిని, పెందుర్తి


