బీసీలు శాసించే స్థాయికి ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

బీసీలు శాసించే స్థాయికి ఎదగాలి

Jun 16 2025 7:19 AM | Updated on Jun 16 2025 7:19 AM

బీసీలు శాసించే స్థాయికి ఎదగాలి

బీసీలు శాసించే స్థాయికి ఎదగాలి

బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్‌

షాద్‌నగర్‌రూరల్‌: బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్‌ అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం రాయికల్‌ శివారులోని ఎన్‌హెచ్‌–44 హోటల్‌లో ఆదివారం బీసీసేన జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలైన బీసీలు సమాజంలో గణనీయమైన వాటా కలిగి ఉన్నారని అన్నారు. జనాభా ప్రకారం అత్యధికంగా ఉన్నప్పటికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అనుకున్న స్థాయిలో ఎదగలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగుబలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని తెలిపారు. జనాభా ప్రకారం అధికంగా ఉన్న బీసీలు రాజ్యాధికార సాధన దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీసేన జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌యాదవ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బీసీసేన నాయకులు సుధాకర్‌, చంద్రశేఖర్‌, వరలక్ష్మి, శారద, వెంకటేశ్‌, దేవేందర్‌, సౌజన్య, జక్కుల జలజ, స్రవంతిరాజ్‌, భాగ్యలక్ష్మి, అనిత, శ్రీనివాస్‌, శివకుమార్‌, మహేష్‌, వరప్రసాద్‌, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement