
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కుల్కచర్ల: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్, చౌడాపూర్ తదితర గ్రామాల్లో 242మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చితే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలకు లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకుంటున్నారన్నారని వివరించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మార్కెట్ కమిటీ డైరక్టర్ రామ్మోహన్ శర్మ, చౌడాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్పాటి అశోక్కుమార్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య, సలీం, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యత
దోమ: మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి దాదాపూర్ రైతు వేదికలో 249 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు అనసూయ, ఏఎంసీ డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, శాంత్ కుమార్, బద్రి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమేష్ గౌడ్, పార్టీ నాయకులు రాఘవేందర్ రెడ్డి, యాదయ్యగౌడ్, అంతిరెడ్డి, బాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజు, బసన గౌడ్, మొగులయ్య గౌడ్, శేఖర్, చెనయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి