రాజీయే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీయే రాజమార్గం

Jun 15 2025 9:20 AM | Updated on Jun 15 2025 9:20 AM

రాజీయే రాజమార్గం

రాజీయే రాజమార్గం

పరిగి: రాజీయే రాజమార్గమని పరిగి జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి నాగుల శిల్ప అన్నారు. శనివారం వివిధ కేసులపై మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించా రు. లోక్‌ అదాలత్‌లో ఇరువురి రాజీ ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి శి ల్ప మాట్లాడుతూ పంతాలకు పోయి గొడవలు పెంచుకోవద్దని సూచించారు. క్షణికావేశంలో చేసిన తప్పులు పలు కేసులకు దారితీస్తాయన్నారు. కావు న ఎలాంటి కేసులైన లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఇక్కడ పరిష్కారమైన కేసులను అంతిమ పరిష్కారంగా పరిగణిస్తారన్నారు. కావున కేసులు ఉన్న వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ బాలముకుందర్‌, బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇబ్రాహింఖాన్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

పరిగి జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి నాగుల శిల్ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement