
రాజీయే రాజమార్గం
పరిగి: రాజీయే రాజమార్గమని పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప అన్నారు. శనివారం వివిధ కేసులపై మెగా లోక్ అదాలత్ నిర్వహించా రు. లోక్ అదాలత్లో ఇరువురి రాజీ ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి శి ల్ప మాట్లాడుతూ పంతాలకు పోయి గొడవలు పెంచుకోవద్దని సూచించారు. క్షణికావేశంలో చేసిన తప్పులు పలు కేసులకు దారితీస్తాయన్నారు. కావు న ఎలాంటి కేసులైన లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఇక్కడ పరిష్కారమైన కేసులను అంతిమ పరిష్కారంగా పరిగణిస్తారన్నారు. కావున కేసులు ఉన్న వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ బాలముకుందర్, బార్అసోసియేషన్ అధ్యక్షుడు ఇబ్రాహింఖాన్, న్యాయవాదులు పాల్గొన్నారు.
పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప