మిస్‌ యూ చైతూ బావా | - | Sakshi
Sakshi News home page

మిస్‌ యూ చైతూ బావా

Jan 31 2025 2:01 AM | Updated on Jan 31 2025 7:45 AM

-

శుక్రవారం పెళ్లి.. ముందురోజు యువతి మృతదేహం లభ్యం 

డిసెంబర్‌ 14న వివాహ నిశ్చితార్థం 

జనవరి 20న యువతి అదృశ్యం 

‘ఐ లవ్‌ యూ చైతూ బావా..’ అంటూ చివరి లేఖ 

గూడూరు రూరల్‌: ‘చైతు బావా.. నా కోసం ఏదైనా చేస్తాను అన్నావుగా.. నీకు పుట్టే బిడ్డకు నా పేరు పెట్టు.. నాకు మీరు చూడగానే నచ్చారు. మీ లైఫ్‌లోకి వచ్చినందుకు చాలా హ్యాపీ అని మీరు అన్నారు. ఆ మాటకు నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా.. కానీ ఇప్పుడు బాధపడుతున్నా. మిమ్మల్ని వదిలి వెళుతున్నా.. నా జ్ఞాపకాలు మీతో విడిచి వెళ్లిపోతున్నా.. సారీ..’ అని రాసి ఓ యువతి అదృశ్యమైంది. ఆమెకు శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉండగా.. గురువారం శవమై తేలింది. ఈ ఘటన గూడూరులో కలకలం రేపింది. వివరాలు..

గూడూరు ఒకటవ పట్టణ ఎస్‌ఐ తిరుపతయ్య కథనం.. సూళ్లూరుపేట రాఘవయ్యపేట ప్రాంతంలో నివాసం ఉండే శ్యాముయేల్‌ జయకుమార్‌ గూడూరు సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య రమాదేవి. వారి కుమార్తె లేహా నిస్సీ(19)ను తాను పనిచేసే కళాశాలలో డేస్‌ స్కాలర్‌గా బీటెక్‌ ఈసీఈ గ్రూపులో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా తన ఆరోగ్యం బాగా లేక పోవడంతోసెలవు పెట్టి ఇంటి వద్దనే ఉంటున్న శ్యాముయేల్‌ తన కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించారు.

వివాహం ముందు రోజే..
బంధువుల అబ్బాయితో వివాహం చేసేందుకు డిసెంబర్‌ 14న నిశ్చితార్థం చేశారు. జనవరి 31న వివాహం జరింపించేందుకు సిద్ధపడ్డారు. అయితే ఈనెల 20న కాబోయే పెళ్లి కుమార్తె నిస్సీ కళాశాలకు అని ఇంట్లో చెప్పి వచ్చేసింది. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. ఆమె తండ్రి సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో వెతుకుతున్నారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ గూడూరు సమీపంలో తాను చదివే కళాశాలకు పక్కనే ఉన్న పంబలేరులో గురువారం నిస్సీ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement