
● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్ ● ఉమ్మడి చిత్
చిత్తూరు కలెక్టరేట్:ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పారదర్శకంగా, పకడ్బందీగా సాగాల్సిన బదిలీల ప్రక్రియపై టీచర్లు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నుంచి ప్రక్రియ ముగిసే వరకు గందరగోళం నెలకొంది. కేడర్ల వారీగా పారదర్శకమైన సీనియారిటీ జాబితా రూపొందించడంలో జిల్లా విద్యాశా ఖ విఫలమైంది. మెరిట్ రోస్టర్ ప్రకారం కాకుండా రోస్టర్ మెరిట్ ప్రకారం జాబితా సిద్ధం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్కు ఫిర్యాదులు వెళ్లడంతో ఆ తర్వాత సరిదిద్దారు. ఆ జాబితాల్లో తప్పులుండటంతో విద్యాశాఖ అధికారులను ఏమి అడిగినా తమకు సంబంధం లేదని నిర్లక్ష్య సమాధా నం చెప్పడంతో చాలా మంది టీచర్లు నష్టపోయారు.
జీఓ 22కు తిలోదకాలు
కౌన్సెలింగ్ ప్రక్రియలో జీఓ 22కు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా వ్యవహరించారు. మొదట్లో 2008 హామీ పత్రాలకు సంబంధించి నోషనల్ సీనియారిటీని..సీనియారిటీగా ఆన్లైన్లో నమోదు చేయలేదు. ఈ విషయంపై నోషనల్ సీనియారిటీ కేవలం ఆర్థిక, ఉద్యోగోన్నతులకు మాత్రమే వర్తిస్తుందని పలువురు టీచర్లు అప్పీల్ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత లీప్ యాప్లో డేటా సరిదిద్ధారు. ఈ నిర్ణయం వల్ల 133 మంది టీచర్లు నోషనల్ సీనియారిటీని సరిదిద్దుకోకుండా అదే స్థానాల్లో బదిలీలు పొందారు. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారుల మాట విన్నందుకు చాలా మంది టీచర్లు బదిలీల్లో నష్టపోయారు. నోషనల్ సీనియారిటీ సరిదిద్దుకోని టీచర్లు లాభం పొందారు.
వైఎస్సార్సీపీ సర్కారులో
పారదర్శకంగా బదిలీలు
గత వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో టీచర్ల బదిలీలు సాఫీగా సాగాయి. టీచర్లకు అప్పట్లో నిర్వహించిన ఆన్లైన్ బదిలీల్లో ఎలాంటి సమస్యలు తలెత్తని పరిస్థితి. నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహించడంతో గతంలో అన్ని కేడర్ల టీచర్లకు న్యాయం జరిగింది. అయితే ప్రస్తుత కూటమి సర్కారు టీచర్ల బదిలీల బాధలను మిగిల్చారు. బదిలీల ప్రక్రియలో సాప్ట్వేర్ తప్పిదం, విద్యాశాఖ అధికారుల నియతృత్వ పోకడలతో చాలా మంది టీచర్లు నష్టపోయారు. ఈ బదిలీల ప్రక్రియలో నష్టపోయిన పలు కేడర్ల టీచర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. కూటమి పాలనలో నిర్వహించిన బదిలీల్లో తీవ్రంగా నష్టపోయామని కొంత మంది టీచర్లు మదనపడుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం పాఠశాలలు 4,737
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యాయుల వివరాలు
ప్రాథమిక పాఠశాలలో టీచర్లు : 3,236
ప్రాథ్రమికోన్నతలో : 656
ఉన్నత పాఠశాలలో : 1,766
హైస్కూల్ ప్లస్ : 485
జూనియర్ కళాశాలలో : 466
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఉపాధ్యాయురాలు పేరు సుధారాణి. ఆమె 9 నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. అయితే డీఈవో పూల్ లో ఉండే భాషా పండితుల బదిలీల్లో ఆమెకు అన్యాయం జరిగింది. కూటమి పాలనలో వెబ్ విచిత్ర బదిలీలతో ఉద్యోగ విరమణ పొందే సమయంలో ఆమె సీనియర్ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా 120 కి.మీ దూరంలో బదిలీ చేశారు. తిరుపతి సమీపంలో ఆప్షన్ నమోదు చేసినప్పటికీ దూరప్రాంతంలో బదిలీ చేయడంతో ఆమె నష్టపోయింది.
ఈ టీచర్ పేరు కస్తూరీ. ఈమెకు స్పౌజ్ నిబంధనను నమోదు చేసుకున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా 90 కి.మీ దూరంలో బదిలీ చేశారు. దీంతో ఈమె ప్రస్తుత బదిలీల్లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ టీచర్ పేరు కనకదుర్గ. ఈమె న్యాయపరంగా భర్తతో విడాకులు తీసుకున్నారు. దీంతో ఫ్రిపరెన్షియల్ కేటగిరీలో పాయింట్స్ పొంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అన్ని అర్హతలున్నా నిబంధనలకు వ్యతిరేకంగా అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలానికి బదిలీ చేశారు.
టీచర్లకు బదిలీల్లో అన్యాయం ఇలా..
గతంలో టీటీడీ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు స్పౌజ్ పాయింట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం వారికి పాయింట్లు ఇవ్వడం కుదరదని మొండికేశారు. కమిషనర్ కార్యాలయం నుంచి వివరణ వచ్చినప్పటికీ పరిగణలోకి తీసుకోని పరిస్థితి. దీంతో చాలా మంది పీఎస్ హెచ్ఎంలు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు.
2021లో బదిలీలు పొంది 2025లో రేషనలైజేషన్కు గురైన వారికి పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టించారు.
ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించి తిరుపతి రుయాలో ప్రత్యేకంగా చికిత్సలు చేయించి మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఫలితాలు ఇచ్చారు. సంబంధిత టీచర్లకు పర్సంటేజీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. అయితే చివరి వరకు ఆ సమస్య పరిష్కరించకపోవడంతో ఫిపరెన్షియల్ పాయింట్లు పొందలేక నష్టపోయారు.
అలవెన్స్లు పొందుతున్న టీచర్లకు బదిలీల్లో మినహాయింపులు ఇచ్చారు. అయితే సంబంధిత టీచర్లకు బదిలీల్లో ప్రాధాన్యం కల్పించలేదు.
సీనియారిటీ జాబితాల్లో తప్పుల సవరణకు సంబంధించి అభ్యంతరాలు ఇచ్చిన టీచర్ల పై దురుసుగా ప్రవర్తించి మొండిగా వ్యవహరించారు. సంఘాల నాయకులను కౌన్సెలింగ్ కేంద్రంలోకి రానివ్వకుండా బెదిరింపులకు గురిచేశారు.
జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఎటువంటి పోస్టును బ్లాక్ చేయకుండా బదిలీలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గొప్పలు చెప్పారు. అయితే ఈ బదిలీల్లో పలు పోస్టులు బ్లాక్ చేసి టీచర్లు నష్టపోయేలా వ్యవహరించారు. దీంతో సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో చాలా మంది టీచర్లు బదిలీ అయినా రిలీవర్ లేక అలాగే కొనసాగాల్సిన దుస్థితి. బదిలీ అయినా కుప్పం నుంచి విముక్తి కలగలేదని చాలా మంది టీచర్లు ఆవేదన చెందుతున్నారు.
స్పౌజ్ విషయంలో స్పౌజ్ ఎక్కడ ఉంటే చుట్టు పక్కల ఉండే మండలాలకు వెళ్లాలి. అయితే ఈ నిబంధన ఎస్జీటీ బదిలీల్లో సీరియల్ నంబర్ 204 వరకు అమలు చేయకపోవడంతో నష్టపోయారు. ఇద్దరు టీచర్లు కంపల్సరీ బదిలీ అయితే వారు ఎక్కడైనా కోరుకునే అవకాశం ఉంటుంది. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ నిబంధనను అమలు చేయకుండా నిర్భంధం పెట్టి సర్టిఫికెట్ ఎక్కడ పెట్టి ఉంటే అక్కడే కోరుకోవాలనే వింత పోకడ అమలు చేశారు. దీంతో వందల సంఖ్యలో టీచర్లు బదిలీల్లో నష్టపోయారు. ఆ తర్వాత ఆందోళనలు చేశాక అమలు చేశారు.
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఉద్యోగోన్నతి ఇస్తున్నామని చెప్పి చివరికి వారికి ఉద్యోగోన్నతులు ఇవ్వకుండా తిరిగి పంపేశారు.
డీఈవో పూల్ లో ఉన్న వందల మంది భాషా పండితులకు నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు చేశారు. సీనియారిటీ ఉన్న వారికి దూరంగా, జూనియర్లకు దగ్గరగా పోస్టింగ్లు ఇచ్చారు. దీంతో ఆ టీచర్లు బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ చివరి రోజు డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది.

● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్ ● ఉమ్మడి చిత్

● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్ ● ఉమ్మడి చిత్

● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్ ● ఉమ్మడి చిత్

● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్ ● ఉమ్మడి చిత్

● వారం రోజులుగా సాగిన టీచర్ల కౌన్సెలింగ్ ● ఉమ్మడి చిత్