నాయుడుపేట టౌన్ : పట్టణంలోని అవాని అపార్టుమెంట్ వెనుక వీధిలోని ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్న సమాచారంతో ఆదివారం సాయంత్రం సీఐ బాబీ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఇద్దరు మహిళలు, ఒక విటుడు, నిర్వాహకుడు ఈదురు పవన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. సీఐ మాట్లాడుతూ సురేష్, వవన్ కుమార్ ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకుడితో పాటు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మరో వ్యక్తి సురేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
తీరంలో సందడి
వాకాడు : సముద్రంలో వేట విరామం గడువు ముగిసిపోంది. రెండు నెలల తర్వాత ఆదివారం వాకాడు మండలం తూపిలిపాళెం తీరంలో సందడి మొదలైంది. వేకువజామునే మత్స్యకారులు తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహించారు. వేట సామగ్రితో సముద్రంలోకి బయలుదేరారు. తొలి రోజు వాతావరణంలో మార్పుల కారణంగా అరకొర మత్ససంపదతో ఒడ్డుకు చేరారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో తూపిలిపాళెం బీచ్కు చేరుకున్నారు. సముద్రంలో స్నానం చేసి, వన భోజనాలతో సందడి చేశారు.
రెండు ఇళ్లలో చోరీ
పాకాల : మండలంలోని చెన్నుగారిపల్లె దళితవాడలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రెండిళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఆదివారం ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. వేణు, అతడి కుమారుడు శ్రీనివాసులు పక్కపక్కనే వేర్వేరుగా నివసిస్తున్నారు. శనివారం వారు ఎస్ఆర్పురం వెళుతూ రెండిళ్ల తాళాలను బాత్రూమ్లలో ఉంచారు. ఈ విష యం పసిగట్టిన దుండగులు ముందుగా బాత్రూమ్లలోని రెండిళ్ల తాళాలలను తీసుకుని లోపలికి చొరబడ్డారు. వేణు ఇంట్లో 150 గ్రాము ల వెండి, 16 గ్రాముల బంగారం, శ్రీనివాసులు నివాసంలో 250 గ్రాముల వెండి, 30 గ్రాముల బంగారం అపహరించారు. ఆదివారం తిరిగి వచ్చిన వేణు, శ్రీనివాసులు తమ ఇళ్లలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలను సేకరించారు. చోరీ తీరును పరిశీలిస్తే ఈ పని తెలిసిన వారు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సీఐ సుదర్శన్ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యభిచార గృహంపై దాడి
వ్యభిచార గృహంపై దాడి