
వ్యాధి నియంత్రణలో నిర్ధారణ, చికిత్సలే కీలకం
ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా ఆలీవ్ హాస్పిటల్ అవగాహన సదస్సు
హైదరాబాద్: ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ (మెదడులో కణతులు) వ్యాధి ఆట కట్టించాలంటే సరైన నిర్ధారణ, చికిత్సలే కీలకమని హైదరాబాదులోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఆలీవ్ హాస్పిటల్ న్యూరాలజీ నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధిపై పౌరులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాన్నినిర్వహించారు.
ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధిస్తూ, రోగుల ప్రాణాలను కాపాడటానికి అంకితభావంతో వైద్య సేవలు అందించేందుకు ఆలివ్ హాస్పిటల్ కృషి చేస్తొంది. జీవితాన్నితల కిందులు చేసే బ్రెయిన్ ట్యూమర్ల వ్యాధిపైప్రజలలో అవగాహన పెంచడం, ముందస్తుజాగ్రత్తలతో పలు సూచనలు చేస్తున్నారు. క్యాన్సర్, క్యాన్సర్ కాని మెదడు కణితులు ఏటా వేలాది మంది భారతీయులను ప్రభావితం చేస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) డేటా ప్రకారం, దేశంలో ప్రతి ఏడాది 40,000 కంటే ఎక్కువ మందిలో కొత్తగా మెదడు కణితులు గుర్తించబడుతున్నాయి.
తరచూ తలనొప్పి, దృష్టిలోపాలు, జ్ఞాపకశక్తికోల్పోవడం వంటి నిర్దిష్ట లక్షణాల ఫలితంగా అనేక ఇతర కణితులు గుర్తించబడకుండా పోతున్నాయని నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా “ఆలివ్ హాస్పిటల్ గత ఏడాదిలోనే బ్రెయిన్ ట్యూమర్ కన్సల్టేషన్లలో 20% పెరుగుదలను నమోదు చేసిందనీ గుర్తుచేశారు. ఆసుపత్రిలోని న్యూరాలజీ, న్యూరోసర్జరీ యూనిట్లు అధునాతన MRI డయాగ్నస్టిక్స్, స్టీరియోటాక్టిక్ సర్జికల్ పరికరాలు, న్యూరాలజీ , పాలియేటివ్ కేర్, పునరావాస మద్దతుతో కూడిన మల్టీడిసిప్లినరీ కేర్ మోడల్ తో పూర్తిగా అధునాతన పరిజ్ఞానంతో వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది.
‘మెదడు కణితులు మోసపూరితమైనవి; లక్షణాలు ఎప్పుడూ బయటపడవు. అప్పుడప్పుడు ఇది నిరంతర తలనొప్పిలేదా ప్రవర్తనలో వివరించలేని మార్పువంటి సాధారణమైన దానితో ప్రారంభమవుతుంది. తమ శరీరాలపైశ్రద్ధ వహించాలని, ముందుగానే తమను తాము తనిఖీ చేసుకునేలా ఆలీవ్ హాస్పిటల్ ప్రోత్సహిస్తోంది. రోగాన్నిగుర్తించడం వల్ల సంరక్షణ నాణ్యత పెరుగుతుందనీ, రోగి యొక్క జీవన నాణ్యత పెరుగుతోంది. వ్యాధిని నయం చేయడంతో పాటుగా, రోగులు, వారి కుటుంబాలకు చికిత్స, ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో ప్రతి అడుగులో తోడుగా ఉంటుంది అని ఆలివ్ హాస్పిటల్ లోని సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ మహమూద్ అలీ అన్నారు.
క్లినికల్ సూక్ష్మ నైపుణ్యాలతోపాటుగా, రోగి, వారి కుటుంబాలకు భావోద్వేగ, మానసిక భారాన్నికూడా పెంచుతుందని అర్థం చేసుకోవాలి. ఆలివ్ హాస్పిటల్ సకాలంలో నాడీ మూల్యాంకన చేసి వ్యాధిని కచ్చితత్వంతో గుర్తిస్తుంది. మెదడు కణితుల ప్రారంభ దశను కొన్నిసూచనల ద్వారా గుర్తించే వీలు ఉందని, దీంతో అధిక ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడే వీలుంటుందని వైద్యులు పేర్కొన్నారు. జూన్ 8న నిర్వహించే ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే సంద్భరంగా వ్యాధిపైఉన్న అపోహలను తొలగించడానికి, న్యూరో హెల్త్ పై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నట్లుగా అలీ హాస్పిటల్ న్యూరో విభాగం వైద్యులు వివరించారు.
ఆలివ్ హాస్పిటల్ గురించి:
ఆరోగ్య సంరక్షణకు భరోసానిస్తూతెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్కృషి చేస్తుంది. ఆధునాతన వైద్య సదుపాయాలు, నాణ్యత, నిబద్ధతతో కూడిన సమగ్ర ఆరోగ్య సంరక్షణయే లక్ష్యంగా 2010 నుంచి వైద్య సేవలు అందిస్తోంది. మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడం కోసం సాధారణ వైద్య సంస్థగా మొదలుపెట్టి.. ఆనాటి కాలంలోనే రోగి సంరక్షణలో అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా నిలిచింది. 210 పడకలతో, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది.
కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీసర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీకేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్ మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్, ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం వహించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించి, సమర్థులైన వైద్యులతో వైద్యం అందించడానికి కట్టుబడి ఉంది. దేశంలో ఆరోగ్య సంరక్షణ నాణ్యత ప్రమాణాలను కలిగి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ఫర్ హాస్పిటల్స్– హెల్త్కేర్ నుండి జాతీయ స్థాయిలో గుర్తింపును కలిగి ఉంది.