Vishnuvardhan Reddy Who Died While Receiving Treatment - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి పుత్రశోకం

Published Fri, Jul 28 2023 2:23 AM

Vishnuvardhan Reddy who died while receiving treatment - Sakshi

పటాన్‌చెరు టౌన్‌: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి(35) గురువారం అనారోగ్యంతో మృతిచెందారు. మూడురోజుల క్రితం గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా కామెర్లు సోకాయి. వైద్యులు డయాలసిస్‌ కూడా చేశారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. సమాచారం తెలుసుకున్న మంత్రులు హరీశ్‌రావు, దయాకర్‌రావు ఆస్పత్రికి చేరుకొని ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు. సాయంత్రం ఇక్కడ నిర్వహించిన అంత్యక్రియల్లో మంత్రులు మహమూద్‌ అలీ, హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు, జగ్గారెడ్డి, కలెక్టర్‌ శరత్, ఎస్పీ రమణకుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వెన్నవరం భూపాల్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సత్యనారాయణ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement