Sakshi News home page

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చేదు అనుభవం

Published Sat, May 6 2023 1:22 PM

TS New Secretariat Security Personnel Stopped MLA Raja Singh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ నూతన సచివాలయం వద్ద గోషామహల్‌ ఎమ్మెల్యేను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. రాజాసింగ్‌ను కొత్త సెక్రటేరియట్‌లోకి అనుమతించలేదు.  

ఈ సందర్బంగా రాజాసింగ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ జిల్లా అభివృద్ధికి చర్చలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తనను ఆహ్వానించారని అన్నారు. తలసాని ఆహ్వానం మేరకు తాను సెక్రటేరియట్‌కు వచ్చినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. భద్రతా సిబ్బంది.. రాజాసింగ్‌ను లోపలికి అనుమతించకపోవడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌.. పొంగులేటి కొత్త పార్టీ?

Advertisement

What’s your opinion

Advertisement