
హైదరాబాద్: సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్(సెటా) ఆగస్టు 29 నుంచి 31వ తేదీ వరకు హైటెక్స్లో ఎలక్ట్రిక్ ఎక్స్పో నిర్వహిస్తున్నదని, జాతీయ స్థాయిలో పేరొందిన ఎలక్ట్రిక్ కంపెనీలు బ్రాండ్లు ఇందులో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని సెటా అధ్యక్షుడు సురేష్జైన్ తెలిపారు.
బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ ఎక్స్పోకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ ఎక్స్పోలో సుమారు 180 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఇది అతిపెద్ద ఎక్స్పో కాబోతున్నదని తెలిపారు.
