Huzurabad bypoll: ఇంటర్‌ పరీక్షల రీషెడ్యూల్‌

Reschedule Of Inter First Year Exams Due To Of Huzurabad By Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేసినట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. 29,30 తేదీన జరగాల్సిన పరీక్షలను ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. అక్టోబర్‌ 29న జరగాల్సిన పరీక్షలను అక్టోబర్‌ 31.. 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్‌ 1న నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది.(చదవండి: బెట్టు వీడని ఏజెంట్లు.. మెట్టు దిగని సర్కారు)

ఈ నెల 25న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 26న ఇంగ్లీష్‌ పేపర్‌-1, 27న మాథ్స్‌ పేపర్‌-1ఏ, బోటని పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1, 28న మ్యాథ్స్‌ పేపర్‌-1బీ, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1, 31న ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1, నవంబర్‌ 1న కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1, నవంబర్‌ 2న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1 పరీక్షలు జరుగుతాయి.

చదవండి:
బాలికలకు చాక్లెట్ల ఆశ చూసి.. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top