కేందమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ లేఖ | Cm Revanth Reddy Letter To Union Minister Kishan Reddy | Sakshi
Sakshi News home page

కేందమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ లేఖ

Jun 16 2026 9:49 PM | Updated on Jun 16 2026 9:52 PM

Cm Revanth Reddy Letter To Union Minister Kishan Reddy

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో ఫేజ్-2 నిధుల విడుదలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఐఆర్‌ఎఫ్‌సీ లోన్ ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-I ని రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసింది. ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సహకరించాలని కోరారు. ఫేజ్-1 టేకోవర్‌కు రూ.15,000 కోట్లు - రూ.1,461 కోట్లు ఈక్విటీ, రూ.13,538 కోట్లు రీఫైనాన్స్ నిధులు విడుదలకు సహకరించాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

ఐఆర్‌ఎఫ్‌సీ లోన్ శాంక్షన్ చేసినా నిధులు విడుదల చేయలేదన్న సీఎం.. రాష్ట్రం అన్ని షరతులు పూర్తి చేసిందని.. రూ.84 కోట్ల అప్‌ఫ్రంట్ ఫీజు చెల్లించిందని లేఖలో రేవంత్‌ పేర్కొన్నారు. 1,461 కోట్లు ఎస్క్రో అకౌంట్‌లో జమ చేశాం.. అయినా ఐఆర్‌ఎఫ్‌సీ నిధులు ఆపేసిందన్న సీఎం.. ఫేజ్-2లో 7 కారిడార్లు, 122.9 కి.మీ, రూ.38,595 కోట్ల ప్రాజెక్ట్.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

ఫేజ్-2కి 50:50 జాయింట్ వెంచర్‌గా ఆమోదం ఇవ్వాలని సీఎం రేవంత్‌ డిమాండ్ చేశారు. కేంద్రం ఒప్పుకోకుంటే రాష్ట్రమే సొంతంగా ఫేజ్-2 చేపడుతుందన్న సీఎం.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం దానం అడగడం లేదన్న సీఎం.. డ్యూ డిలిజెన్స్ తర్వాత శాంక్షన్ అయిన లోన్ ఇవ్వమంటున్నామన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ లేక 9వ స్థానానికి పడిపోయిందని.. బెంగళూరు, చెన్నై, ముంబై దూసుకుపోతున్నాయని.. హైదరాబాద్ వెనుకబడిందని సీఎం రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణకు చెందిన కేంద్రమంత్రిగా జోక్యం చేసుకోవాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘‘ఆర్‌బీఐ డైరెక్ట్ డెబిట్ మెకానిజం, ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చాం. అయినా లోన్ ఆపేశారు. ఆర్‌ఎఫ్‌సీ ప్రభుత్వ రంగ సంస్థే.. కేంద్రం ఆదేశిస్తే వెంటనే నిధులు వస్తాయి. మెట్రో విస్తరణ ఆలస్యమైతే హైదరాబాద్‌కు తీవ్ర నష్టం. వెంటనే నిర్ణయం తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement