మరమ్మతు పనులు ఆపండి | - | Sakshi
Sakshi News home page

మరమ్మతు పనులు ఆపండి

Jul 30 2025 8:43 AM | Updated on Jul 30 2025 8:43 AM

మరమ్మతు పనులు ఆపండి

మరమ్మతు పనులు ఆపండి

వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని కోరంతాంగల్‌ గ్రామం వద్ద రైల్వే బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి కింద వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఇకపై ఈ రైలు మార్గంలో రైలు అతివేగంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు తనిఖీలు చేసి రైల్వే బ్రిడ్జి కింద పిల్లర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో మంగళవారం ఉదయం బ్రిడ్జి కింద పిల్లర్లు ఏర్పాటు చేసేందుకు కార్మికులు అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు బ్రిడ్జి కింద ఎటువంటి పనులు చేపట్టకూడదని కార్మికులను అడ్డుకున్నారు. బ్రిడ్జి కింద వాహనాలు వచ్చి వెళ్లేలా ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే పనులు మొదలెట్టాలని తేల్చి చెప్పడంతో అఽధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరిపి ఆందోళన విరమింప జేశారు. అనంతరం అధికారులతో పోలీసులు చర్చించి వాహన రాక పోకలకు దారి ఏర్పాటు చేసి పనులను ప్రారంభించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement