● వాడవాడలా యోగా డే ● త్రివిధ దళాల నేతృత్వంలో కార్యక్రమాలు ● విద్యా సంస్థలలోనూ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

● వాడవాడలా యోగా డే ● త్రివిధ దళాల నేతృత్వంలో కార్యక్రమాలు ● విద్యా సంస్థలలోనూ వేడుకలు

Jun 22 2025 3:40 AM | Updated on Jun 22 2025 3:40 AM

● వాడ

● వాడవాడలా యోగా డే ● త్రివిధ దళాల నేతృత్వంలో కార్యక్రమా

ఆపరేషన్‌ సింధూర్‌కు సెల్యూట్‌..

ఆపరేషన్‌ సింధూర్‌కు సెల్యూట్‌ అన్న నినాదంతో హిందూ స్తాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు యోగా డేను జరుపుకున్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ – భారత సైన్యానికి వీర వందనం నినాదంతో భారత సాయుద దళాల వీరత్వం , త్యాగానికి గౌరవాన్ని కల్పించారు. ఆపరేషన్‌ సింధూర్‌ హెచ్‌ఐఎస్‌పీ–25 ఆకారంలో నిలబడి విద్యార్థులు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం వర్గాలు తమ వీర వందనం సమర్పిస్తూ యోగాసనం చేశారు. హిందూస్థాన్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆనంద్‌ జాకబ్‌ వర్గీస్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సాక్షి, చైన్నె : జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అనుసరిస్తున్న విషయం తెలిందే. భారత ప్రాచీన కళకు లభించిన గుర్తింపును అధికారికంగా వేడుక తరహాలో కేంద్ర ప్రభుత్వం ఏటా కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది. ఆ దిశగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఉదయం రాష్ట్రంలో వాడవాడలా యోగాసనాలు హోరెత్తాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్మీ క్యాంప్‌లు, అకాడమిలు , ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌, డిఫెన్స్‌ బేస్‌ కార్యాలయాలు, కోస్టుగార్డు కార్యాలయాలు, నావికాదళం కార్యాలయాల్లో యోగాసనాల కార్యక్రమాలు జరగాయి. అలాగే దీంతో ప్రైవేటు సంస్థలు, బీజేపీతో పాటూ కొన్ని సంఘాల నేతృత్వంలో, విద్యాలయాలు, ఆథ్యాత్మిక కేంద్రాలు, ఉద్యాన వనాలు, పార్కులు తదితర ప్రాంతాల్లో యోగ శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర రాజధాని నగరం చైన్నెతో పాటూ తిరుచ్చి,మదురై, తిరునల్వేలి, సేలం, తూత్తుకుడి, తంజావూరు, నాగపట్నం, వంటి నగరాల్లో యోగా డే వేడుకలు జరిగాయి. యోగా గురువులు ఆసనాలను ప్రదర్శించి హాజరైన వారి చేత చేయించారు.

వివిధ ప్రాంతాలలో..

ప్రముఖ పర్యాటక కేంద్రం మహాబలిపురంలోని సముద్ర తీర ఆలయం వద్ద యోగా డే ఘనంగా జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సిసోర్‌ టెంపుల్‌ వద్ద ఎయిర్‌ ఫోర్స్‌ వర్గాలు యోగాసనాలు చేశారు. అడయార్‌ ఐఎన్‌ఎస్‌, డిఫెన్స్‌ కార్యలయం నేతృత్వంలో చైన్నె సముద్ర తీరంలో యోగా కార్యక్రమం జరిగింది. సెయింట్‌ థామస్‌ మౌంట్‌ ఆర్మీ అకాడమితో పాటూ చైన్నె సముద్ర తీరంలో పలు చోట్ల, పార్కుల్లోనూ యోగా కార్యక్రమాలు జరిగాయి. వేలూరు జిల్లా గుడియాత్తంలో జరిగిన కార్యక్రమంలో మాజీ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ , సినీ నటి నమిత హాజరయ్యారు. మదురైలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో 10 వేల మంది విద్యార్థులతో జరిగిన బ్రహ్మాండ వేడుకలో అందరితో గవర్నర్‌ రవి యోగాసనాలు చేయించడంతో పాటూ స్వయంగా 51 సార్లు పుష్‌ అప్‌ తీయడం విశేషం. ఐఐటీ మద్రాసు ఆవరణలో జరిగిన యోగా డేకు త్రిపురా గవర్నర్‌ ఎన్‌ ద్రసేనారెడ్డి, ఐఐటీ డైరెక్టర్‌ కామకోటి, డీన్‌ గుమ్మిడి ఎన్‌ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. దక్షిణ రైల్వే నేతృత్వంలో చైన్నె, తిరుచ్చి,మదురై, సేలంలతో పాటూ నుంగంబాక్కం రైల్వే ఆఫీసర్స్‌ క్లబ్‌లో జరిగిన యోగాసనాలలో డీఆర్‌ఎం బి. విశ్వనాథ్‌ ఈరయ్య తదితరులు పాల్గొన్నారు. అరుంబాక్కం సిద్ధ, వైద్య కళాశాలలో జరిగిన యోగా డే లో ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం పాల్గొని యోగాసనాలు చేశారు. పెరంబూరులోని ఇంటిగ్రల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) లో యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌ – వన్‌ హెల్త్‌ నినాదంతో జరిగిన కార్యక్రమానికి ఐసీఎఫ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నవీన్స్‌ టవర్స్‌లో..

మేడవాక్కంలోని నవీన్స్‌ టవర్స్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అక్కడి నివాసితులు ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి యోగాసనాలు చేశారు. స్టార్‌ వుడ్‌ టవర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నవీన్స్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌కుమార్‌, డైరెక్టర్‌ పి భవానీ, క్షీర వసుధ కుమార్‌లు హాజరయ్యారు.

బ్యాంకులలో..

వివిధ బ్యాంక్‌ల కార్యాలయాలలోనూ యోగా డే కార్యక్రమాలు జరిగాయి. ఇండియన్‌ బ్యాంక్‌ నేతృత్వంలో పలుచోట్ల యోగా డే జరిగింది. కార్పొరేట్‌ ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమానికి ఇండియన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బినోద్‌కుమార్‌ అధికారులు మహేష్‌కుమార్‌, అశుతోష్‌ చౌదరి, శివ భజరంగ్‌సింగ్‌తో పాటూ అనంత యోగా సెంటర్‌ వర్గాలు హాజరయ్యారు.

● వాడవాడలా యోగా డే ● త్రివిధ దళాల నేతృత్వంలో కార్యక్రమా1
1/1

● వాడవాడలా యోగా డే ● త్రివిధ దళాల నేతృత్వంలో కార్యక్రమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement