రైలు చార్జీలను పెంచవద్దు | - | Sakshi
Sakshi News home page

రైలు చార్జీలను పెంచవద్దు

Jun 26 2025 6:53 AM | Updated on Jun 26 2025 6:53 AM

రైలు

రైలు చార్జీలను పెంచవద్దు

సాక్షి, చైన్నె : రైలు చార్జీలను పెంచవద్దని కేంద్రానికి సీఎం స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. రైలు చార్జీలను జూలై ఒకటి నుంచి పెంచనన్నట్టు సమాచారాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ మేరకు తమిళనాడులో పలు మార్గాల్లో ఉదాహరణకు నెల్‌లై, తూత్తుకుడి, తెన్‌కాశి వైపుగా వెళ్లే రైళ్లలో రూ.15కు పైగా చార్జీలు పెరగవచ్చన్న సమాచారం వెలువడింది. అలాగే సేలం, కోయంబత్తూరు వైపుగా వెళ్లే రైళ్లలో రూ.20 వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఓ జాబితా సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోందని, ఈ పరిస్తితులలో చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని కేంద్రరైల్వే శాఖకు బుధవారం సీఎం స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. రైలు చార్జీల పెంపునకు చర్యలు తీసుకోవడం సబబు కాదన్నారు. అస్సలే రైళ్లలో జనరల్‌ కోచ్‌లు, సాధారణ కోచ్‌ల సంఖ్య తగ్గించేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ సమయంలో చార్జీల పెంపునకు కసరత్తులు చేయడాన్ని మరింతగా వ్యతిరేకిస్తున్నామని, తక్షణం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

నివాళి

భారత మాజీ ప్రధాని దివంగత వీపీ సింగ్‌ 95వ జయంతిని పురస్కరించుకుని బుధవారం రాజధాని కళాశాల ఆవరణలోని ఆయన విగ్రహం, చిత్ర పటానికి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి స్వామినాథన్‌, డిప్యూటీ మేయర్‌ మహేశ్‌కుమార్‌తో పాటు అధికారులు నివాళులర్పించారు. – సాక్షి, చైన్నె

ఒప్పందం

కాంచీపురం జిల్లా ఒరగడం పారిశ్రామిక వాడలోని డైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌(డీఐసీవీ) భారత్‌ బెంచ్‌ మైనింగ్‌ ట్రక్కుల కోసం గైన్‌వెల్‌ ట్రక్కింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌ బెంజ్‌ మైనింగ్‌ ట్రక్కులను పంపిణీ చేయడం, అమ్మకాలు, సేవలపై దృష్టి సారించేలా ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి గెయిన్‌ వెల్‌ చైర్మన్‌ సునీల్‌ చతుర్వేది, డైమ్లర్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ చతుర్వేది తదితరులు హాజరయ్యారు.

– సాక్షి, చైన్నె

ఘనంగా వీరరాఘవ స్వామి తెప్పోత్సవం

తిరువళ్లూరు: పట్టణంలో ప్రసిద్ధి చెందిన వీరరాఘవ స్వామి ఆలయంలో ఆణి అమావాస్యను పురస్కరించుకుని బుధవారం రాత్రి తెప్పోత్సతం వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన వైద్య వీర రాఘవస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి రాష్ట్రంతో పాటు ఆంధ్ర తెలంగాణ కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులు అమావాస్యకు వచ్చి పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, పుష్కరిలో పుణ్య స్థానాల ఆచరించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కాగా ఏటా ఆణిమాసంలో మూడు రోజులపాటు తెపోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆణి అమావాస్య కావడంతో మొదటిరోజు పుష్కరిణిలో శ్రీదేవి భూదేవితో కలిసి వైద్య వీరరాఘవుడు భక్తులకు దర్శనం ఇచ్చారు. తెపోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కాగా భక్తులు చేసిన గోవింద నామస్మరణతో పుష్కరిణి ప్రాంగణం మారు మోగింది. ఇలా ఉండగా మూడు రోజులపాటు మూలవర్‌ ముత్తంగి సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

100 అడుగులు వెనక్కి వచ్చిన సముద్రపు నీరు

తిరువొత్తియూరు: అమావాస్య రోజైన బుధవారం తిరుచెందూరు వద్ద సముద్రం 100 అడుగుల మేరకు నీరు వెనక్కి తగ్గింది. భక్తులు, భీతి లేకుండా నిర్భయంగా పుణ్యస్నానాలు చేశారు. తిరుచెందూరులోని సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద సముద్రం అమావాస్య, పౌర్ణమి వంటి రోజుల్లో ఉప్పొంగుతోంది. ఆ క్రమంలో బుధవారం అమావాస్య కావడంతో, ప్రకృతి వైపరీత్యాల కారణంగా, తిరుచెందూరు వద్ద సముద్రం నీరు ఉదయం నుంచి సుమారు 100 అడుగుల మేరకు వెనక్కి వెళ్లింది. దీంతో అయ్యవైకుందర్‌ అవతారపతి సమీపంలోని బీచ్‌లో నాచుతో కూడిన రాళ్లు కనిపిస్తున్నాయి. భక్తులు రాళ్లపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు.

రైలు చార్జీలను పెంచవద్దు 
1
1/2

రైలు చార్జీలను పెంచవద్దు

రైలు చార్జీలను పెంచవద్దు 
2
2/2

రైలు చార్జీలను పెంచవద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement