నాలుగు కొత్త ఆర్ట్స్‌ కళాశాలలు | - | Sakshi
Sakshi News home page

నాలుగు కొత్త ఆర్ట్స్‌ కళాశాలలు

Jun 21 2025 3:47 AM | Updated on Jun 21 2025 3:47 AM

నాలుగ

నాలుగు కొత్త ఆర్ట్స్‌ కళాశాలలు

2025–26 విద్యాసంవత్సరంలోనే విద్యా సేవలు అందించే విధంగా ఏర్పాటు చేసిన నాలుగు కొత్త ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలను సీఎం ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా కళాశాలలను ప్రారంభించి, అక్కడి వసతులను పరిశీలించారు. వేలూరు జిల్లాలోని తిరువళ్లువర్‌ వర్సిటీలో రూ.36.18 కోట్లతో నిర్మించిన భవనాలను ప్రారంభించారు.

సాక్షి, చైన్నె: ఉన్నత విద్యాపరంగా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా నాన్‌ మొదల్వన్‌, తమిళ్‌ పుదల్వన్‌, పుదుమైపెన్‌ వంటి పథకాలను విజయవంతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే, పేద గ్రామీణ విద్యార్థుల ఉన్నత విద్య అవసరాలు పూర్తి చేయడానికి, 2025–26 సంవత్సరానికి ఉన్నత విద్యాశాఖ నేతృత్వంలో 11 కొత్త ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్‌న్స్‌ కళాశాలలు ఏర్పాటు చేశారు. గత నెల ఈ కళాశాలలను ప్రారంభించారు. కళాశాలలు, సీట్ల సంఖ్య పెరిగినా, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కోర్సుల్లో చేరే వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉండడంతో మరో నాలుగు కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమయ్యేలా విస్తృత చర్యలు తీసుకున్నారు.

నాలుగు కళాశాలల ప్రారంభం

ఉన్నత విద్యాశాఖ తరఫున వేలూరు జిల్లా కె.వి.కుప్పం, తిరుచ్చి జిల్లా – తురైయూర్‌, కళ్లకురిచి జిల్లా–ఉలుందూర్‌పేట, తిరువణ్ణామలై జిల్లా– సెంగంలలో ఈ కళాశాలలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ కళాశాలలను సీఎం స్టాలిన్‌ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఒక్కో కళాశాలలో ఐదు కోర్సులను అమలు చేస్తూ తొలి విడతగా చర్యలు తీసుకున్నారు. అలాగే, ప్రతి కళాశాలకు 12 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు (మొదటి సంవత్సరానికి మాత్రమే) నియమించారు. అలాగే, 14 మంది చొప్పున బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. ఈ నాలుగు కళాశాలలకు ఒక సంవత్సరం స్కాలర్‌షిప్‌ల మంజూరు ఖర్చుల కోసం రూ.8కోట్ల 67లక్షలు కేటాయించారు.

1,120 మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశశం కల్పించారు. 4 కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల సంఖ్య 180కు చేరింది. అలాగే, వేలూరులోని తిరువళ్లువర్‌ వర్సిటీలో రూ. 18 కోట్ల 74 లక్షతో ఐదు అంతస్తులతో నిర్మించిన భవనం, రూ.2 కోట్ల 38 లక్షల 70 వేలతో నిర్మించిన విద్యా భవనం, వైస్‌ చాన్స్‌లర్‌ నివాసం, రూ. 8.49 కోట్లతో నిర్మించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నివాసాలు, రూ6.కోట్ల 56 లక్షల 20వేలతో నిర్మించిన బోధనేతర సిబ్బందికి గృహాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. ఇక్కడి వసతులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే పరిశీలించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌, ప్రజా పనుల మంత్రి ఈవీ వేలు, ఉన్నత విద్యాశాఖా మంత్రి డాక్టర్‌ గోవి చెజియాన్‌, ప్రధాన కార్యదర్శి మురుగానందం, విద్యా శాఖ కార్యదర్శి సమయమూర్తి, కళాశాల విద్యా కమిషనర్‌ ఎ.సుందరవల్లి, సీనియర్‌ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

ప్రారంభించిన సీఎం స్టాలిన్‌

నాలుగు శాఖల అధికారులతో సమీక్ష

అధికారులతో సమీక్ష

ప్రారంభోత్సవాల అనంతరం ఆహార శాఖ, రెవెన్యూ, ఎంఎస్‌ఎంఈ, పశు సంవర్ధకం, మత్స్య శాఖ, పాడి పరిశ్రమలు, పెట్టుబడులు, పరిశ్రమల శాఖ మంత్రులు, అధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆయా శాఖల్లో పథకాల తీరు తెన్నులు, ప్రాజెక్టుల అమలును సమీక్షించారు. బడ్జెట్‌లో కేటాయింపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పనుల విస్తృతం గురించి చర్చించి ఆదేశాలు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌, మంత్రులు అన్బరసన్‌, టీఆర్‌బీ రాజా, కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, అనితా రాధాకృష్ణన్‌, మనో తంగరాజ్లతో పాటుగా ఆయా శాఖల కార్యదర్శులు, కమిషనర్లు పాల్గొన్నారు.

నాలుగు కొత్త ఆర్ట్స్‌ కళాశాలలు1
1/2

నాలుగు కొత్త ఆర్ట్స్‌ కళాశాలలు

నాలుగు కొత్త ఆర్ట్స్‌ కళాశాలలు2
2/2

నాలుగు కొత్త ఆర్ట్స్‌ కళాశాలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement