బీఎడ్‌, పీజీ కోర్సులకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

బీఎడ్‌, పీజీ కోర్సులకు దరఖాస్తులు

Jun 21 2025 3:47 AM | Updated on Jun 21 2025 3:47 AM

బీఎడ్‌, పీజీ కోర్సులకు దరఖాస్తులు

బీఎడ్‌, పీజీ కోర్సులకు దరఖాస్తులు

● ఆన్‌లైన్‌లో శ్రీకారం ● ప్రారంభించిన ఉన్నత మంత్రి గోవి చెజియాన్‌

సాక్షి, చైన్నె : ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యాలయాలలో బీఎడ్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌(పీజీ) కోర్సుల ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల ప్రక్రియను శుక్రవారం ఉన్నత విద్యాశాఖా మంత్రి గోవి చెజియాన్‌ ప్రారంభించారు. ఉదయం చైన్నెలోని క్వీన్‌ మేరీ కళాశాలలో 2025–26 బీఎడ్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌సైన్‌ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల ప్రవేశం నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆన్‌లైన్‌లో మంత్రి శ్రీకారం చుట్టారు. 110 కళాశాలలలోని 24,309 పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులకు శుక్రవారం నుంచి జూలై 9వ తేదీ వరకు ఠీఠీఠీ.్ట ుఽజ్చట్చ.జీ ుఽ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు అని మంత్రి సూచించారు. ర్యాంకింగ్‌ జాబితాను జూలై 18న విడుదల చేస్తామన్నారు. 21 నుంచి 25వ తేదీ వరకు తమకు నచ్చిన కళాశాలను విద్యార్థులు ఎంచుకోవచ్చు అని వివరించారు. ఆగస్టు 6 నుంచి అన్ని ప్రభుత్వ , ప్రభుత్వ సహకారంతో నడిచే కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు.

బీఎడ్‌ వివరాలు

బీఎడ్‌ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి మంత్రి వివరిస్తూ 7 ప్రభుత్వ విద్యా కళాశాలలో 900 సీట్లు, 14 ప్రభుత్వ సహకారంతో నడిచే కళాశాలలో 1,140 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈ సీట్ల కోసం జూలై 9లోపు దరఖాస్తులు చేసుకోవాలని, జూలై 18వ తేదీన ర్యాంకుల జాబితా, 21 నుంచి 25 వ తేదీ వరకు కళాశాలల ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. 28వ తేదీన సీట్ల కేటాయింపు ఉత్తర్వుల జారీ, 31వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు కళాశాలలో అడ్మిషన్లు, ఆగస్టు 6 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం ఉంటుందన్నారు. తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా కళాశాల విద్యా విభాగానికి ఎంపికై న 6 మందికి ఈసందర్భంగా ఉద్యోగ నియామక ఉత్తర్వులను మంత్రి అందజేశారు. విద్యాశాఖ కార్యదర్శి సమయమూర్తి, కమిషనర్‌ ఎ.సుందరవల్లి ఐ, క్వీన్‌ మేరీ కళాశాల ప్రిన్సిప్‌ డాక్టర్‌ పి. ఉమామహేశ్వరి, ఉన్నత విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement