
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ లేబుల్ మా చిత్రానికి ప్లస్
మెడ్రాస్ మ్యాట్నీ చిత్ర సక్సెస్ మీట్లో నటుడు కాళివెంకట్, దర్శకుడు కార్తికేయన్ , మణి తదితరులు
తమిళసినిమా: మెడ్రాస్ మ్యాట్నీ చిత్రంలో కాళీవెంకట్, సత్యరాజ్, రోషిణి హరిప్రియన్, షెల్లీ, స్వామినాథన్, విశ్వ, జార్జ్ మరియన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
మడ్రాస్ మోషన్న్స్ పిక్చర్స్ ప్రొడక్షన్ పతాకంపై ఆర్చ్ థామసన్, రాబర్ట్ మార్టచెన్కో, కొరిన్నే మార్టిచెనచెన్కో, మణి, దేవ్ ఆనంద్ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీకేయన్ మణి కథా, దర్శకత్వం వహించారు. కేసీ.బాలసారంగన్ సంగీతం, ఆనంద్.జీకే చాయాగ్రహణం అందించారు. గురువారం తెరపైకి వచ్చిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ విడుదల చేసింది.
ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నటి రోహిణి హరిప్రియన్ మాట్లాడుతూ చిన్న బడ్జెట్ చిత్రం అయినా తమ కలలు చాలా పెద్దవని, అవి ఈ చిత్రం ద్వారా నెరవేర్చినందుకు అందరికీ థ్యాంక్స్ అని పేర్కొన్నారు. తన నటనను ప్రశంసిస్తూ ప్రోత్సహించిన దర్శకుడికి ధన్యవాదాలని ఆమె అన్నారు. ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం పలువురు సినీ ప్రముఖులు సపోర్ట్ చేశారని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్వాహకుడు గుహన్ పేర్కొన్నారు. వసూళ్లు అన్నది సెకండరీ అనీ చిత్రం ప్రేక్షకుల్లో ఎలాంటి ప్రభావం చూపిందన్నదే ముఖ్యమని, ఆ విషయంలో మెడ్రాస్ మ్యాట్నీ చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నారు. మెడ్రాస్ మ్యాట్నీ చిత్రంగా చేయడానికి ముఖ్య కారణం ఇది ఎవరు చెప్పని కథ అని అన్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ అధినేతలు లేకపోతే ఈ చిత్రానికి ఇంత జీవం వచ్చేది కాదన్నారు. ఈ చిత్రానికి ఆడియన్స్ రెస్పాన్స్ మరచిపోలేనన్నారు. మన ఆడియన్స్ అభిరుచి కలవారే కాదు. చాలా ఇంటిల్జెంట్స్ అన్నారు. నటుడు కాళీవెంకట్ అందరూ చెప్పుకోవాల్సిన నటుడని దర్శకుడు కార్తీకేయన్ మణి అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడికి కతజ్ఞతలు అని, నటుడు ఖాళీ వెంకట్ పేర్కొన్నారు. థియేటర్లో ప్రేక్షకులు కన్నీళ్లతో అభినందించడం మరచిపోలేని అనుభవం ఆయన అన్నారు. సత్యరాజ్తో కలిసి నటించే సన్నివేశాలు లేక పోయినా, ఆయన ఉన్న ఈ చిత్రంలో తాను ఉండడం సంతోషం అన్నారు. ఈ చిత్రానికి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ లేబుల్ పెద్ద ప్లస్ అని అన్నారు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ లేబుల్ మా చిత్రానికి ప్లస్