ఉప రాష్ట్రపతికి ఘనస్వాగతం | - | Sakshi
Sakshi News home page

ఉప రాష్ట్రపతికి ఘనస్వాగతం

Jun 16 2025 5:43 AM | Updated on Jun 16 2025 5:43 AM

ఉప రాష్ట్రపతికి ఘనస్వాగతం

ఉప రాష్ట్రపతికి ఘనస్వాగతం

సాక్షి, చైన్నె: భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ చైన్నె, పుదుచ్చేరిలలో ఘన స్వాగతం లభించింది. పుదుచ్చేరిలో మూడు రోజుల పర్యటన నిమిత్తం జగదీప్‌ ధన్‌ఖర్‌ ఆదివారం ఉదయం చైన్నెకు వచ్చారు. ఆయనకు చైన్నె విమానాశ్రయంలో మంత్రి మదివేందన్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పుదుచ్చేరికి ఆయన వెళ్లారు. పుదుచ్చేరి విమానాశ్రయంలో ఆయనకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కై లాష్‌ నాథన్‌, సీఎం రంగస్వామి, మాజీ సీఎం నారాయణస్వామి, వైద్యలింగం, మంత్రులు ఆహ్వానం పలికారు. ఉపరాష్ట్రపతి సముద్రతీరంలో పర్యటించడంతో పర్యాటకులకు అనుమతి ఇవ్వలేదు. ఆదివారం సెలవు రోజున బీచ్‌ వైపు వచ్చిన వారికి నిరాశ తప్పలేదు. సోమవారం జిప్మర్‌లో, మంగళవారం సెంట్రల్‌ వర్సిటీలో జరిగే కార్యాక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement