త్వరలో 8 జిల్లాలకు కాంగ్రెస్‌ కమిటీ | - | Sakshi
Sakshi News home page

త్వరలో 8 జిల్లాలకు కాంగ్రెస్‌ కమిటీ

Jun 17 2025 5:34 AM | Updated on Jun 17 2025 5:34 AM

త్వరలో 8 జిల్లాలకు కాంగ్రెస్‌ కమిటీ

త్వరలో 8 జిల్లాలకు కాంగ్రెస్‌ కమిటీ

● ఢిల్లీకి జాబితా

సాక్షి, చైన్నె : రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎనిమిది జిల్లాలకు కొత్త కమిటీ నిర్వాహకులను ఎంపికచేశారు. అధిష్టానం ఆమోదంతో త్వరలో వీరి వివరాలను పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై ప్రకటించనన్నారు. తిరునల్వేలి, తూత్తుకుడి, దిండుగల్‌, తిరుప్పూర్‌, రామనాధపురం సహా ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇతర నిర్వాహకుల పనితీరు అసంతృప్తికరంగా ఉన్నట్టు, వీరిపై అనేక ఆరోపణలు ఉన్నట్టు టీఎన్‌సీసీకి ఫిర్యాదులు ఇటీవల హోరెత్తాయి. వీటిని పరిశీలించిన అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, విచారణ చేపట్టారు. అలాగే, తాను అధ్యక్షుడైన తర్వాత జిల్లాల కమిటీలలో ఇంతవరకు మార్పుచేయని దృష్ట్యా, ఇదే అదనుగా అధిష్టానం దృష్టికి వివరాలను తీసుకెళ్లారు. ఢిల్లీ పెద్దలతో భేటీ అనంతరం చైన్నెకి వచ్చిన సెల్వ పెరుంతొగై సూచనప్రాయంగా త్వరలో 8 జిల్లాల కమిటీల్లో మార్పు అని పార్టీ ముఖ్యులకు సమాచారం ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. ఆ తర్వాత దశల వారీగా మరికొన్ని జిల్లాల్లోనూ మార్పులు జరుగుతున్నట్టు టీఎన్‌సీసీ కార్యాలయం సత్యమూర్తి భవన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని జిల్లాల్లో తన మద్దతుదారులను నియమించే దిశగా సెల్వపెరుంతొగై కసరత్తులు చేసినట్టు తెలిసింది. ప్రధానంగా తన సొంత జిల్లా కాంచీపురంతో పాటు పొరుగున ఉన్న మరికొన్ని జిల్లాలో తన మద్దతుదారులకు పదవులు కట్టబెట్టే విధంగా జాబితాను ఢిల్లీలో ఇచ్చినట్టు సమాచారం.

బుల్లితెర నటి నిహానాబేగంపై ఫిర్యాదు

తమిళసినిమా: మొదటి భర్తతో వివాహరద్దు అయ్యిందని చెప్పి తనను మోసం చేసిందని బుల్లితెర నటి నిహానాబేగంపై వ్యాపారవేత్త పూందమల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు..పొన్ని, పాండియన్‌ స్టోర్స్‌ వంటి పలు సీరియల్స్‌లో నటించిన నిహానాబేగం. ఈమైపె పోరూర్‌ సమీపంలోని కోళపాక్కంకు చెందిన రాజ్‌కన్నన్‌ అనే వ్యాపారవేత్త మోసంచేసి పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందులో ఇద్దరు పిల్లల తల్లి అయిన నిహానాబేగం తాను భర్త నుంచి వివాహరద్దు పొందినట్లు చెప్పిందన్నారు. ఆమెతో తన పరిచయం స్నేహంగా మారి, ఆ తరువాత పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే నిహానాబేగం తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోలేదని తరువాత తెలిసిందని, తనను మోసం చేసి, రూ.20 లక్షల వరకూ తీసుకుందని ఆరోపించాడు. తనను మోసం చేసిన ఆమైపె తగిన చర్యలు తీసుకోవాలని, తన నుంచి తీసుకున్న రూ.20 లక్షలను తిరిగి ఇచ్చేలా చేయాలని ఆ పిటిషన్‌లో కోరాడు. పోలీసులు నిహానాబేగంను, రాజ్‌కన్నన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించడానికి సిద్ధమయ్యారు.

పదోన్నత్తులపై

అధ్యయనానికి కమిటీ

మూడు నెలలో నివేదికకు ఆదేశాలు

సాక్షి, చైన్నె : ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో సామాజిక న్యాయం అమలులో ఉన్న చిక్కులను అధిగమించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ న్యాయమూర్తి జీఎం అక్బర్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలల్లో ఈ కమిటీ నివేదిక ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా ఎంపికై న వారితోపాటు వివిధ కేటగిరిల వారీగా వివిధ మార్గాల్లో నియమితులైన వారందరికీ పదోన్నతుల విషయంలో సమస్య తప్పడం లేదు. సివిల్‌ సర్వీస్‌ ప్రమోషన్‌ ప్రక్రియపై సామాజిక న్యాయం ప్రభావం గురించి ఇటీవల సుప్రీంకోర్టు సైతం ప్రశ్నలు లేవనెత్తిన దృష్ట్యా, ఈ వ్యవహారంపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ర్యాకింగ్‌ జాబితా, పదోన్నతుల్లో సామాజిక న్యాయం దిశగా అధ్యయనం చేయడానికి రిటైర్డ్‌ న్యాయమూర్తి జీఎం అక్బర్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ అన్ని కోణాల్లో అధ్యయనం చేసి, వివరణాత్మక నివేదికను మూడు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement