
జల దోపిడీకే బనకచర్ల ప్రాజెక్టు
సూర్యాపేట : గోదావరి నది మిగులు జలాలు, వరద జలాల పేరుతో తెలంగాణ నికర జలాలను దోపిడీ చేసేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును రూపొందించిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర నాయకత్వం కృష్ణ, గోదారి నదులపై అడ్డగోలుగా ప్రాజెక్టు నిర్మించి తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా దోచుకెళ్లారని మళ్లీ ఇప్పుడు గోదావరి నది నుంచి 200 టీఎంసీల నీళ్లను తరలించుకెళ్లడానికి బనకచర్ల ప్రాజెక్టు మొదలు పెట్టారన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్టు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, కార్యదర్శి బొడ్డు శంకర్ గౌడ్, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ధరావత్ వీరేష్ నాయక్, డీఎల్ సెల్ జిల్లా కార్యదర్శి బొజ్జ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్ను
వెంటనే ఆపాలి
హుజూర్నగర్ (చింతలపాలెం) : ఆపరేషన్ కగార్ పేరిట కొనసాగిస్తున్న హత్యకాండను వెంటనే ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన అన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద చేపట్టనున్న మహాధర్నా వాల్ పోస్టర్ను ఆదివారం చింతలపాలెంలో సీపీఐ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2024 జనవరి నుంచి మావోయిస్టులను అణచివేసే పేరిట ఆదివాసీలతోపాటు మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలను హతమార్చడం దారుణ చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తెల నారాయణరెడ్డి, మండల కార్యదర్శి చింతిరాల రవి, గ్రామ శాఖ కార్యదర్శి గంధం మంగయ్య, నాయకులు వీరబాబు, జియాలుద్దీన్, హైమవతి, శ్రీనివాసరావు, రామారావు, రామయ్య, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీసమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రబాత సేవ, పంచామృతాభిషేకం, ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అనంతరం కల్యాణం జరిపించి స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు.
స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటశ్వరస్వామి దేవాలయం వద్ద అదివారం శ్రావణ నక్షత్రం సందర్భంగా భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధిఉత్సవ సేవ, రథోత్సవం నిర్వహించారు.

జల దోపిడీకే బనకచర్ల ప్రాజెక్టు

జల దోపిడీకే బనకచర్ల ప్రాజెక్టు