
భూ భారతి.. దరఖాస్తుల హారతి
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025
నాగారం : పెండింగ్ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 3 నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభించగా 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలో 23 మండలాలు, 486గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 22 మండలాలకు సంబంధించి 311 గ్రామసభల ద్వారా 26,367 భూభారతి దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. వీటిల్లో ఇప్పటివరకు 8,668 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారు. సదస్సుల అనంతరం దరఖాస్తుల ఆధారంగా నోటీసులు జారీచేసి సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. కాగా.. గరిడేపల్లి మండలంలో మే–5 నుంచి 12వరకు భూభారతి కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. గరిడేపల్లి మండలంలోని 11 రెవెన్యూ గ్రామాల్లో 1690 దరఖాస్తులు వచ్చాయి.
గత తప్పిదాలతో ఇబ్బందులు
గతంలో చేసిన భూదస్త్రాల నమోదులో చోటుచేసుకున్న తప్పిదాలు అన్నదాతలకు శాపంగా మారాయి. ఒకరి పేరు బదులు మరొకరు, విస్తీర్ణంలో వ్యత్యాసం, తప్పుగా నమోదైన సర్వే నంబర్లు, నిషేధిత జాబితాలో చేర్చడం, పట్టా రాకపోవడం.. ఇలా పలు రకాల సమస్యలతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల ఖర్చు తడిసి మోపడైనా సమస్యలు పరిష్కారం కాలేదు.
ఆన్లైన్లో నమోదు ....
రెవెన్యూ సదస్సుల్లో ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మండలానికి ఇద్దరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి దరఖాస్తులను కేటగిరీలుగా విభజించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. సాదాబైనామా, అసైన్డ్ భూములకు సంబంధించిన దరఖాస్తులను మినహాయించి మిగిలిన వాటిని పరిశీలిస్తున్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా నోటీసులు జారీచేసి, దరఖాస్తులను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్గదర్శకాలు ఇలా...
రెవెన్యూ అధికారులు దరఖాస్తును పరిశీలించి ఫిర్యాదు సమర్పించిన రైతుతో పాటు సమీపంలోని రైతుకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇరువురి వద్ద ఉన్న రికార్డులతో పాటు ఆధారాలు సమర్పించేందుకు ఏడు రోజుల గడువు విధిస్తారు. నిర్దేశిత గడువులోపు సమర్పించిన ఆధారాలు, దస్త్రాలను పరిశీలిస్తారు. రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులతో పోలుస్తారు. అనంతరం దరఖాస్తు వాస్తవికతను తేల్చనున్నారు.
న్యూస్రీల్
ఫ రెవెన్యూ సదస్సులకు
దరఖాస్తుల వెల్లువ
ఫ ఇప్పటివరకు 26,367
దరఖాస్తుల స్వీకరణ
ఫ 8,668 ఆన్లైన్లో నమోదు
ఫ ఈనెల 20 వరకు కొనసాగనున్న
సదస్సులు
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాల్లో ఈనెల 20వ తేదీ వరకు రెవెన్యూ గ్రామ సభలు జరగనున్నాయి. స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అనంతరం విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తాం.
– రాంబాబు, అదనపు కలెక్టర్, సూర్యాపేట