పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యం

Oct 8 2025 6:35 AM | Updated on Oct 8 2025 6:35 AM

పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యం

పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యం

పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యం

ఎమ్మెల్సీ నర్తు రామారావు

కవిటి: వైఎస్సార్‌సీపీలో పార్టీ కోసం పనిచేసేవారికి సరైన ప్రాధాన్యం లభిస్తుందని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. మండలంలోని కొత్తపుట్టుగలో ఉన్న ఆయన నివాసంలో కవిటి మండల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ కడియాల ప్రకాష్‌ ఆధ్వర్యంలో మండల పార్టీ శ్రేణులు ఆయనను మంగళవారం సన్మానించారు. ఎమ్మెల్సీగా శ్రీకాకు ళం జిల్లాతో పాటు ఇచ్ఛాపురం నియోజకవర్గ సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించిన తీరును నాయకులంతా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ.. శాసన మండలి సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించే అవకాశం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వలనే దక్కిందని తెలియజేశారు. ఆయన ఆశయాల మేరకు ఇచ్ఛాపు రం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. కుసుంపురం గ్రామానికి చెందిన బెంతు సామాజిక నాయకుడు శివ బిసాయి మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాల్లో తమ బెంతు ఒరియా ల సమస్యలను ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిసారీ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు. కడియాల ప్రకాష్‌ మాట్లాడుతూ.. పరిపూర్ణమైన అవగాహనతోనే నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించారని కొనియాడారు. పాండవ శేఖర్‌, పీఎం తిలక్‌, పూడి నేతాజీ, బెందాళం జయప్రకాశ్‌, గోపయ్య, మురళి, బర్ల నాగభూషణం, కృష్ణారావు, బాబురావు, వై.అశోక్‌, రవి, నారాయణ స్వామి, బర్ల నాగు, కాయ భీమసేన్‌, దువ్వు కృష్ణారెడ్డి, పాండవ శేఖర్‌, పిరియా కృష్ణారావు, చందాన పూర్ణచంద్రుడు, దుద్ది ధర్మారావు, పాతిన వెంకటరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement