
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025
నీట్లో మేటిగా..
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2025 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మెరుగైన ర్యాంకులు సాధించి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే దిశగా మొదటి అడుగు వేశారు.
64వ ర్యాంకు
శ్రీకాకుళం న్యూకాలనీ: అరసవల్లి సమీపంలో నివాసంటున్న పొదిలాపు అవినాష్ ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 64వ ర్యాంకు సాధించాడు. మొత్తం 720 మార్కులకుగాను 652 మార్కులు సాధించి రాష్ట్రంలో టాప్ 5 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులు పొదిలాపు శ్రీనివాసరావు, భారతి. తండ్రి మెడికల్ ఫీల్డ్లో బిజినెస్ చేస్తుండగా, తల్లి గృహిణి.
మానాన్న పొగిరి జగన్నా థం స్కూల్ టీచర్. నాకు చిన్నతనం నుంచి చదు వు ప్రాముఖ్యత చెబుతూ పెంచారు. సమాజాన్ని కూడా చదవాలని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే నా 45వ ఏట పీహెచ్డీ పూర్తి చేశాను. మా నాన్న నేర్పి న పాఠాలే నన్ను ఇంతవాడిని చేశాయి. మా గ్రా మం వెళితే ఇప్పటికి మా నాన్న నాకు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అంత మంచి నాన్న ఉండడం నా అదృష్టం అని అందుకే అంటాను.
– పొగిరి సుగుణాకరరావు, సూపరింటెండెంట్
ఇంజినీర్, సుడా, శ్రీకాకుళం
పొదిలాపు అవినాష్
పాతపట్నం: పాతపట్నం శాంతినగర్కు చెందిన విద్యార్థి ఎర్ర సమీర్కుమార్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 70వ ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 17వ ర్యాంకు సాధించాడు. తండ్రి ఎర్ర ధర్మారావు ఒడిశా లో ఉపాధ్యాయుడిగా, తల్లి జగదాంబ ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు.
సోంపేట: సోంపేట పట్టణాని కి చెందిన రొబ్బి మేఘ సాయివర్ధన్కు నీట్లో ఆలిండియా 942 ర్యాంకు వచ్చింది. సాయివర్ధన్ తల్లిదండ్రులు ముప్పన ఈశ్వరి, రొబ్బి ధర్మారావు ఇద్దరూ టీచర్లే.
పోలాకి: మండలంలోని తోటాడ గ్రామానికి చెందిన తర్ర మైత్రి శనివారం విడుదలైన నీట్ ఫలితాల్లో సత్తాచాటింది. ఓబీసీ కేటగిరీలో ఆల్ ఇండియా 948 ర్యాంక్ సాధించింది. ఇటీవల విడుదలైన ఈఏపీసెట్లో అగ్రికల్చర్ విభాగంలో 33వ ర్యాంక్తో టాపర్గా నిలిచిన సంగతి తెలిసిందే. మైత్రి తల్లిదండ్రులు ప్రభావతి, వైకుంఠరావులు ఉపాధ్యాయులు.
సారవకోట: మండలంలోని అలుదు గ్రామానికి చెందిన పాగోటి జుహిత జాతీయ స్థాయిలో 2744వ ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 979 ర్యాంకు సాధించింది. తండ్రి పాగోటి మురళీధర్ ఎయిర్ ఫోర్స్లో రిటైర్ ప్రస్తుతం బ్యాంకులో పనిచేస్తున్నారు. తల్లి హేమలత గృహిణి.
నరసన్నపేట: స్థానిక మారుతీ నగర్కు చెందిన సూరపు ఝా న్సీ లక్ష్మి శృతి నీట్లో జాతీ య స్థాయిలో 3202వ ర్యాంకును, ఓబీసీ కేటగిరీలో 1150వ ర్యాంకు సాధించింది. శృతి తల్లిదండ్రులు సూరపు కృష్ణారావు, సుధారాణి వైద్యులు. శృతి తాత మెండ యయాతి కూడా వైద్యుడే.
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన లఖినాన శ్రీకర్కశ్యప్ ఆల్ ఇండి యా స్థాయిలో 7205, ఓబీసీ లో 2936వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు లఖినాన వెంకటాచలం, శ్రీదేవి ఇద్దరూ టీచర్లు.

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం